SWARUPANANDA : ఏ రోటి కాడ ఆ పాట… విశాఖ బ్రోకర్ స్వామి రూటే వేరు అప్పుడు జగన్ నా ఆత్మ.. ఇప్పుడు బాబు గ్రేట్ లీడర్

నీచ్ కమిన్ కుత్తేగాళ్లు... సామాన్యుల్లోనే కాదు. స్వామీజీలు... బాబాల్లోనూ పెరిగిపోయారు. విశాఖ శారద పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతు గాడే. హిందూ మతం పేరుతో... యాగాలు.. పూజల్ని అడ్డం పెట్టుకొని... ఏకంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర (Visakha Peetham Swaroopananda) కొత్తగా రూటు మార్చాడు. మొన్నటి వరకు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కి షాడో స్వామిగా వ్యవహరించిన ఈ ఫేక్ బాబా... ఇప్పుడు రూటు మార్చి ఏపీ సీఎం చంద్రబాబు భజన చేస్తున్నాడు.

 

 

 

నీచ్ కమిన్ కుత్తేగాళ్లు… సామాన్యుల్లోనే కాదు. స్వామీజీలు… బాబాల్లోనూ పెరిగిపోయారు. విశాఖ శారద పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతు గాడే. హిందూ మతం పేరుతో… యాగాలు.. పూజల్ని అడ్డం పెట్టుకొని… ఏకంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర (Visakha Peetham Swaroopananda) కొత్తగా రూటు మార్చాడు. మొన్నటి వరకు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కి షాడో స్వామిగా వ్యవహరించిన ఈ ఫేక్ బాబా… ఇప్పుడు రూటు మార్చి ఏపీ సీఎం చంద్రబాబు భజన చేస్తున్నాడు. యాగాల పేరుతో కేసీఆర్ ని కూడా ముంచేసిన స్వరూపానంద… ఇప్పుడు కర్చీఫ్ చంద్రబాబు (CM Chandrababu) పేషీలో వేయడానికి సిద్ధమవుతున్నాడు.

శ్రీకాకుళంలో పుట్టి అక్కడినుంచి విశాఖకు వలస వచ్చి, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఎదురుగా, బాల్ బ్యాడ్మింటన్, టెన్నిస్ రాకెట్లకు నెట్ అల్లే పని చేస్తూ పొట్ట పోసుకునే నరసింహారావు పంతులు హఠాత్తుగా ఒక రోజు విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి అవతారం ఎత్తాడు. నిజానికి కర్ణాటకలో శృంగేరి దగ్గర శారదా పీఠం అనేది 9వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారు స్వయంగా స్థాపించిన పీఠం. శంకరాచార్యులు స్థాపించిన నాలుగు విశిష్ట పీఠాల్లో ఇది ఒకటి. శృంగేరి శారదా పీఠం… హైందవ అద్వైత శాఖకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఠం. దీన్ని అధిరోహించిన వారిని శంకరాచార్యులుగానే పిలుస్తారు.

అయితే టెన్నిస్ బ్యాట్లకు నెట్ అల్లుకుంటూ, అల్లరి చిల్లరి వేషాలు వేసుకుంటూ తిరిగే నరసింహారావు పంతులు హఠాత్తుగా ఓ రోజు విశాఖ లోని పెందుర్తి లో శారదా పీఠాన్ని స్థాపించారు. తన పేరును స్వరూపానంద స్వామిగా చెప్పుకున్నాడు. ఇలా శృంగేరి శారదాపీఠం పేరుని కాపీ కొట్టి శంకరాచార్యుల పేరును భ్రష్టు పట్టించడాన్ని ఆక్షేపిస్తూ కర్ణాటక శృంగేరి పీఠం (Sringeri Peetha) వాళ్లు కోర్టుకెళ్లారు. 11 వందల ఏళ్ల నాటి తమ పీఠం పేరును స్వరూపానంద కాపీ కొట్టి… ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నాడని కోర్టుకు నివేదించారు. కానీ నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు అన్నట్లు స్వరూపానంద స్వామి అలియాస్ నరసింహారావు పంతులు మొండిగా తాను కృత్రిమంగా సృష్టించిన పీఠాన్ని విశాఖ శారదా పీఠంగా అమల్లోకి తెచ్చాడు. ఆశ్రమం కోసం పెందుర్తిలో రెండెకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

అక్కడి నుంచి స్వరూపానంద అసలు వేట మొదలైంది. వ్యాపారులు, రాజకీయ వేత్తలు, సెలబ్రిటీలు వీళ్ళని పరిచయం చేసుకుంటూ… వాళ్ల ద్వారా ఇంకొన్ని పరిచయాలు పెంచుకుంటూ తనకేవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ, యాగాలు, యజ్ఞాలు చేస్తూ, చేయిస్తూ పేరు సంపాదించారు. మీడియాలో ఒక వర్గం బ్రాహ్మణుల్ని ఆకట్టుకోవడం ద్వారా ప్రచారం బాగా సంపాదించగలిగాడు. అసలు ఈ నకిలీ స్వామికి మంత్రోచ్ఛరణ రాదు. వేదాలు తెలియదు. జ్ఞాన బోధ అసలే తెలీదు. ప్రతి ఏడాది రిషికేష్ కి వెళ్లి అక్కడ తపస్సు చేస్తాననీ… అక్కడ తనకు ఆశ్రమం ఉందని చెప్పుకోవడం తప్ప చూసిన వాళ్ళెవరూ లేరు. ఎంతో పురాతనమైన శారదా పీఠం పేరును, కొట్టేసి… తాను ఒక నకిలీ పీఠం సృష్టించి… దానికి పేరు పెట్టి హిందూ మతం పేరుతో దళారీ వ్యవస్థను మొదలుపెట్టారు స్వరూపానంద స్వామి. దేశంలో మిగిలిన అగ్ర పీఠాల వాళ్ళెవరూ ఇతన్ని గుర్తించకపోయినా… తన రూటే సెపరేట్ అని చెప్పుకుంటూ రాజకీయ నేతల ప్రాపకంతో వెలిగిపోసాగాడు. ఒక పెద్ద రికమండేషన్ ద్వారా అప్పటి తెలంగాణ సీఎం కెసిఆర్ ను ఆకట్టుకున్నాడు ఈ ఫేక్ బాబా. కెసిఆర్ కున్న యజ్ఞాలు, యాగాలు పిచ్చని క్యాష్ చేసుకొని రాజశ్యామల యాగం చేయించాడు. అంతేకాదు హైదరాబాద్ కోకాపేటలో వందల కోట్ల విలువైన భూమిని శారదా పీఠం కోసం ప్రభుత్వం నుంచి ఫ్రీగా కొట్టేశాడు స్వరూపానంద స్వామి.

అదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టుకున్నాడు. క్రిస్టియన్ అయిన జగన్… హిందువుల ఓట్ల కోసం తనకో హిందూ స్వామీజీ కావాలి… అందువల్ల బ్రోకర్ స్వామిగా పేరు పడిన స్వరూపానంద ను ఆశ్రయించాడు. జగన్ తో రక రకాల యాగాలు, యజ్ఞాలు జయించాడు స్వరూపానంద. అదృష్టం కలిసొచ్చి జగన్ సీఎం కాగానే… తన వల్లే ముఖ్యమంత్రి అయ్యాడని ప్రచారం చేసుకున్నాడు. జగన్ కూడా తనకు ఒక హిందూ స్వామీజీ కావాలి కనుక… సహజంగా ఉన్నత పీఠాధిపతులెవరూ జగన్ దగ్గరకు చేరరు. అందుకే ఈ స్వామీజీని పక్కన పెట్టుకున్నాడు. అక్కడి నుంచి స్వరూపానంద అసలు గేమ్ స్టార్ట్ అయింది. విశాఖ శారదా పీఠం రాష్ట్ర రాజకీయాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో స్వరూపానంద జోక్యం ఎక్కువైంది. తన భక్తుడు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజుకు… స్వరూపానంద జగన్ కు చెప్పి మంత్రి పదవి ఇప్పించాడు. దాంతో వైసిపి నాయకులంతా డబ్బుల కట్టలు పట్టుకొని… విశాఖ శారదా పీఠానికి లైన్ కట్టారు. జగన్ అండ చూసుకొని స్వరూపానంద తిరుమలపైనా ఆధిపత్యం ప్రదర్శించడం మొదలుపెట్టాడు.

ఆంధ్ర, తెలంగాణలో ఫ్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ అక్రమాలతో వేల కోట్ల రూపాయలు దోచేసి, వేల మంది మధ్యతరగతి జనాన్ని రోడ్డున పడేసిన పరమ నీచుడు, దుర్మార్గుడు… బూదాటి లక్ష్మీనారాయణ స్వరూపానందకు అత్యంత ప్రియ శిష్యుడు. అంతేకాదు విశాఖ శారదా పీఠం ట్రస్టులో కీలక సభ్యుడు కూడా. వేల మంది పొట్ట కొట్టి, కోట్ల రూపాయలు దోచుకున్న ఈ సంస్థ చైర్మన్ బూదాటి లక్ష్మీనారాయణకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా పోస్ట్ ఇప్పించాడు విశాఖ పీఠం స్వరూపానంద స్వామి. దీన్నిబట్టి ఈ బ్రోకర్ స్వామి ఎంత దరిద్రుడో అర్థమవుతుంది. కేవలం హిందూ ముద్ర కోసం ఈ నకిలీ స్వామీజీని పెట్టుకొని జగన్ చేసిన అరాచకాలకు ఉదాహరణ లక్ష్మీనారాయణ లాంటి క్రిమినల్ ను టీటీడీలో సభ్యుడిగా నియమించడమే. ఫ్రీ లాంచ్ స్కాం బయటపడటంతో లక్ష్మీనారాయణ అరెస్టు అయ్యాడు. ఈడీ కేసు కూడా నమోదైంది. దీంతో అతన్ని టిటిడి బోర్డు నుంచి తొలగించారు. లక్ష్మినారాయణ లాంటి క్రిమినల్స్ ని TTDకి రికమెండ్ చేయడం తప్పేనని స్వూరూపానంద ఒక్కసారి కూడా చెప్పలేదు. ఒక స్వామీజీ ఇలా మంత్రి పదవులు ఇప్పించడం, బోర్డు మెంబర్లను నియమించడం, ప్రభుత్వాల దగ్గర ఆశ్రమాలు పేరుతో ప్రజల భూమిని కొట్టేయడం ఒకటి కాదు స్వరూపానంద అరాచకాలు… చాలా ఉన్నాయి.

పక్కా వీధి రౌడీలా మాట్లాడే స్వరూపానంద… జగన్, వై.వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి అండ చూసుకొని చెలరేగిపోయాడు. ప్రభుత్వ ఖర్చులతో తనకి ఇష్టమొచ్చినట్లు యాగాలు, యజ్ఞాలు పేరిట కోట్లు దోచేశాడు. తన వారసుడిగా స్వాత్వానంద స్వామిని ప్రకటించడం వెనక కూడా పెద్ద కుట్రే ఉందని అనుమానిస్తుంటారు స్థానికులు. హైదరాబాదులో కోకాపేటలో కోట్ల విలువైన భూమిని స్వామీజీకి కేటాయించడంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ కూడా ఉంది. మొత్తం మీద స్వయం ప్రకటిత విశాఖ పీఠం స్వరూపానంద పాపం పండింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అండ చూసుకొని చెలరేగిపోయాడు. చివరికి సీఎంలు ఇద్దరు అడ్రస్ లేకుండా పోయారు. జనం వాళ్ళను దారుణంగా ఓడించారు. స్వరూపానంద యజ్ఞాలు, యాగాలు అవినీతిమయమైన సీఎంలు ఇద్దర్నీ కాపాడలేకపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారగానే… ఒక్కసారిగా స్వరూపానంద ప్లేట్ మార్చేసాడు. ఒకప్పుడు జగన్ తన ఆత్మ అని చెప్పుకున్న స్వరూపానంద… ఇప్పుడు హఠాత్తుగా కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు భజన చేయడం మొదలుపెట్టాడు. స్వరూపానంద లాంటి పగటి వేషగాలను నమ్మొద్దనీ…. అతని ఆశ్రమ వ్యవహారాలపై ఎంక్వైరీ కమిషన్ వేసి దర్యాప్తు చేయించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.

అసలు స్వామీజీలకు, బాబాలకు ప్రభుత్వాలతో, రాజకీయ పార్టీలతో ఏంటి సంబంధం? మతాన్ని అడ్డం పెట్టుకుని… లీడర్లను, పార్టీలను, ప్రభుత్వ వ్యవస్థలను శాసించాలనుకునే స్వామీజీలను ఎందుకు ఉపేక్షించాలి? ఇది చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఒకప్పుడు సత్యసాయి బాబా, చిన్న జీయర్ స్వామి, ఇప్పుడు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర… ఇలా చాలామంది ప్రభుత్వ వ్యవస్థల్లో దూరిపోయి వాటిని శాసించాలని ఆత్రుత పడుతుంటారు. లీడర్లు కూడా మూఢనమ్మకాలు కొద్దీ… వీళ్లకు సాష్టాంగ పడి వ్యవస్థల్ని వీరికి దాసోహం చేస్తూ ఉంటారు. కెసిఆర్, జగన్ లాంటి నాయకుల్ని అడ్డం పెట్టుకొని విశాఖ స్వరూపానందేంద్ర స్వామి లాంటివాళ్ళు సమాంతర వ్యవస్థలను నడిపించారు. స్వామీజీని నమ్ముకుని ఇద్దరు ముఖ్యమంత్రులలు తమ పదవులను పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా జనం ఇలాంటి వాళ్ళని తరిమి కొడితే తప్ప వ్యవస్థలు బాగుపడవు.