బిగ్ బ్రేకింగ్: ఐపిఎస్ లకు ఏపీ డీజీపీ బిగ్ షాక్…!

  • Written By:
  • Publish Date - August 14, 2024 / 04:18 PM IST

వెయిటింగులో ఉన్న ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్సులో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్సులకు మెమో జారీ చేసారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్సులకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు, ముగ్గురు ఐజి లు, డీ ఐ జీ లు పలువురు ఎస్పీలు ఉన్నారు.

వెయిటింగులో ఉన్న సీనియర్ ఐపీఎస్ లు ఒకసారి చూస్తే… డీజీపీ స్థాయి అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజి లు కాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి, డీఐజీ లు అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, వెయిటింగులో ఉన్న ఎస్పీ స్థాయి ఐపీఎస్ లు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, పాలరాజు, అన్బ్ రాజన్. వీళ్ళు అందరూ ప్రతి రోజు డీజీపీ ఆఫీసుకు హాజరు కావాల్సి ఉంటుంది.