బ్రేకింగ్: జగన్ భద్రతపై హైకోర్ట్ కీలక అదేశాలు

  • Written By:
  • Publish Date - August 7, 2024 / 02:58 PM IST

తనకు గతంలో ఉన్న భద్రత కుదించడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. వైఎస్ జగన్ ప్రస్తుతం వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ బదులు వేరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని హై కోర్టు ఆదేశించింది. జగన్ మోహన్ రెడ్డికి బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ప్రభుత్వానికి హై కోర్టు సూచించింది. జగన్ కు రిమోట్ కంట్రోల్ ద్వారా హాని జరిగే అవకాశం ఉన్న చోట జామర్ వెహికల్స్ ఏర్పాటు చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సి అవసరం ప్రభుత్వంపై ఉందన్న హై కోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది హై కోర్టు. కాగా తనకు గతంలో ఉన్న భద్రత కొనసాగించాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే.