AP Inter Board : ఏపీ ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇదే చివరి తేదీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఇంటర్‌ బోర్డు మరోసారి పొడిగించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఇంటర్‌ బోర్డు మరోసారి పొడిగించింది. రాష్ట్రంలో వరసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని కళాశాలల్లో ఇప్పటికే ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 31న తుది గడువుని పొడిగిస్తూ సోమవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి నిధిమీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే ఆఖరి విడతని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు. కాగా జూన్‌ 28న టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా.. ఈ పరీక్షలకు మొత్తం 51, 237 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.