రూ.2 కోట్లు ఇస్తే శ్రీనుని వదిలేస్తా మాధురి సంచలన స్టేట్‌మెంట్‌ !

  • Written By:
  • Updated On - August 22, 2024 / 06:15 PM IST

దువ్వాడ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్‌ ఇప్పట్లో ముగిసేలా లేదు. భర్తే కావాలని వాణి ధర్నాలు చేస్తుంటే.. ప్రాణం పోయినా భార్యను దగ్గరికి రానిచ్చేది లేదని శ్రీను తెగేసి చెప్తున్నారు. నా లైఫ్‌ అంతా శ్రీనుకే అంకితం అని మరోపక్క మాధురి రీల్స్‌ మీద రీల్స్‌ చేస్తున్నారు. దాదాపు 13 రోజుల నుంచి దువ్వాడ ఇంటి ముందే వాణి టెంట్‌ వేసుకుని మరీ కూర్చున్నారు. ఇదంతా ఒక ఫ్లోలో కంటిన్యూ అవుతున్న టైంలో ఇప్పుడు దివ్వల మాధురి సడెన్‌గా పెద్ద ట్విస్ట్‌ ఇచ్చారు. దువ్వాడ ఉంటున్న ఇల్లు నిర్మించేందుకు తాను శ్రీనుకు 2 కోట్లు ఇచ్చానని.. ఆ డబ్బు తనకు ఇస్తే నిరభ్యంతరంగా వాణి ఆ ఇంట్లోకి వెళ్లొచ్చంటూ చెప్పారు. నిన్నటి వరకూ చచ్చినా బతికినా శ్రీనుతోనే అన్న మాధురి ఇప్పుడు సడెన్‌గా తన డబ్బు తనకు ఇస్తే శ్రీనును వాణికి ఇచ్చేస్తానని చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. పరిస్థితి చేజారిపోయేలా ఉండటంతో దువ్వాడ కూడా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఉంటున్న ఇంటిని వైసీపీ పార్టీ ఆఫీస్‌గా మార్చేశారు. ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ వైసీపీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. టెక్కలి వైసీపీ కార్యాలయంతో పాటు MLC క్యాప్‌ ఆఫీస్‌గా తన ఇంటిని మార్చేశారు దువ్వాడ. ఇంటి ముందే వాణి మద్దతుదారు ఎప్పుడూ ఉంటూ ఉండటంతో తాను కూడా నలుగురు బాడీగార్డ్స్‌ను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. ఇలా చేస్తే పార్టీ ఆఫీస్‌ దగ్గర గొడవ చేస్తుంది అనే కారణంతో వాణిని అక్కడి నుంచి పంపేయొచ్చు అనే ప్లాన్‌లో దువ్వాడ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్‌ ఏంటి అంటే వాణి కూడా వైసీపీకి చెందని లీడరే. ఇక కొంత కాలంగా వాణి అర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. మాధురి డిమాండ్ చేసినట్టు ఇప్పుడు రెండు కోట్లు మాధురికి ఇచ్చే పరిస్థితిలో వాణి లేరు. ఎలాగూ ఇవ్వలేదు అన్న ధైర్యంతోనే మాధురి ఈ సవాల్‌ విసిరింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ల సవాళ్లు ప్రతిసవాళ్లు ఎలా ఉన్నా.. వీళ్ల ముగ్గురి మధ్య కనిపిస్తున్న సీన్‌ చూస్తుంటే ఈ పంచాయితీ ఇప్పట్లో తెగేలా కనిపించడంలేదు.