Samantha : మీరు గెలిస్తే చూడాలని ఉంది.. సమంత పోస్ట్ ఎవరి గురించి ?

చైతూతో విడాకుల తర్వాత.. సమంత ఏ పోస్ట్ చేసినా.. అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్‌ కూడా తగ్గేదే లే అంటోంది. సినిమా, పాలిటిక్స్‌, స్పోర్ట్స్‌.. దాదాపు అన్నింటిని టచ్ చేస్తూ.. తన ఒపీనియర్‌ చెప్తూ పోస్టులు చేస్తుంటుంది.

 

 

 

చైతూతో విడాకుల తర్వాత.. సమంత ఏ పోస్ట్ చేసినా.. అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్‌ కూడా తగ్గేదే లే అంటోంది. సినిమా, పాలిటిక్స్‌, స్పోర్ట్స్‌.. దాదాపు అన్నింటిని టచ్ చేస్తూ.. తన ఒపీనియర్‌ చెప్తూ పోస్టులు చేస్తుంటుంది. లేటెస్ట్‌గా సమంత చేసిన ఓ పోస్ట్‌.. సోషల్‌ మీడియాను హీటెక్కిస్తోంది. మీరు గెలిస్తే చూడాలని ఉంది.. మీరు గెలవడానికి అర్హులు అంటూ.. సమంత చేసిన ఓ పోస్ట్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. నీ హృదయం ఏది కోరుకున్నా.. మీ ఆకాంక్షలు ఏమైనా… నేను మీకోసం నిలబడతా.. మీరు గెలవడానికి అర్హులు అంటూ సమంత చేసిన పోస్ట్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఇంతకీ సామ్ ఎవరి గురించి ఆ పోస్ట్ చేసింది.. ఫ్రెండ్‌ గురించా.. హీరో గురించా.. లేదంటే రాజకీయాల గురించా.. ఎవరు గెలిస్తే సమంత చూడాలనుకుంటోంది. ఇంత ఎమోషనల్‌ మెసేజ్ ఎందుకు చేసిందని.. ఫ్యాన్స్ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

సమంత చేసిన ఆ పోస్ట్‌కు 7లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయ్. సామ్‌కు ఇన్‌స్టాలో మూడున్నర కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐతే ఇప్పుడు సమంత పోస్ట్‌ ఎవరి గురించనే దానిపై.. అభిమానులు ఎవరికి వారు ప్రెడిక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆర్సీబీ మ్యాచ్ ఉన్న రోజే ఇలాంటి మెసేజ్ పెట్టిందంటే.. బెంగళూరు గెలవాలని కోరుకుంటూ సమంత ఈ పోస్ట్‌ పెట్టారని కొందరు అంటుంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయ్‌.. తన అభిమాన నాయకుడు గెలవాలని ఇలాంటి పోస్ట్ చేసి ఉంటుందని ఇంకొందరు జోస్యం చెప్తున్నారు. మరికొందరయితే.. ఈ పోస్ట్ కచ్చితంగా చైతూ గురించే అని కొత్త వాదన మొదలుపెట్టారు. నాగచైతన్యకు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయని.. అందుకే గెలవాలని కోరుకుంటున్నానని సమంత పోస్ట్ చేసిందంటూ.. ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా సమంత చేసిన ఒక్క పోస్ట్.. ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.