Poonam kaur on Vijaysai reddy: విజయసాయి రెడ్డిపై…. పూనం సంచలన ట్వీట్

విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయి రెడ్డి స్పందించిన తీరుతో ఈ ఇష్యూ మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే శాంతి మీడియా ముందుకు వచ్చి తన బిడ్డకు తండ్రి సుభాష్‌ అని చెప్పడం.. నేను కాదని సుభాస్‌ అనడం.. ఇదంతా నడుస్తున్న సమయంలో శాతి భర్త ఆధారాలతో మీడియా ముందుకు రావడంతో ఈ కథ ఓ పెద్ద సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో తన ట్వీట్ల ద్వారా ఎప్పుడు వివాదాలు వెంటేసుకుని తిరిగే పూనం కౌర్‌ విజయ్‌సాయి రెడ్డిపై సంచలన పోస్ట్‌ చేశారు.

  • Written By:
  • Updated On - July 16, 2024 / 02:06 PM IST

విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయి రెడ్డి స్పందించిన తీరుతో ఈ ఇష్యూ మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే శాంతి మీడియా ముందుకు వచ్చి తన బిడ్డకు తండ్రి సుభాష్‌ అని చెప్పడం.. నేను కాదని సుభాస్‌ అనడం.. ఇదంతా నడుస్తున్న సమయంలో శాతి భర్త ఆధారాలతో మీడియా ముందుకు రావడంతో ఈ కథ ఓ పెద్ద సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో తన ట్వీట్ల ద్వారా ఎప్పుడు వివాదాలు వెంటేసుకుని తిరిగే పూనం కౌర్‌ విజయ్‌సాయి రెడ్డిపై సంచలన పోస్ట్‌ చేశారు. ఈ మొత్త వ్యవహారంలో పూనం విజయ్‌సాయి రెడ్డికే తన మద్దతు తెలిపారు. మీడియాలో ఎన్ని ఆరోపణలు వచ్చినా మీడియా ముందుకు వచ్చి విజయ్‌సాయి ఇచ్చిన క్లారిటీకి నిజంగా మెచ్చుకోవాలన్నారు. మీడియా సంస్థలు అంటేనే ఓ బ్లాక్‌మెయిలింగ్‌ సంస్థలుగా మారిపోయాయంటూ ఆరోపించారు. కొందరు వ్యక్తుల లాభం కోసం వాళ్లు నచ్చినట్టు ఎవరిని పడితే వాళ్లను దోషులను చేస్తారంటూ చెప్పారు. ఇక శాంతికి కూడా ఈ పోస్ట్‌లో పూనం సలహాలు ఇచ్చారు. మీకు అన్ని విధాలా సపోర్ట్‌ చేసే వ్యక్తి మీ వెనకే ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఈ సమస్యపై పోరాడాలంటూ చెప్పారు. గిరిజ‌న మ‌హిళ అయిన శాంతికుమారి త‌ర‌ఫున నిల‌బ‌డిన విజ‌య‌సాయి రెడ్డి గారిని నేను అభినందిస్తున్నానంటూ పోస్ట్‌ చేశారు. విజయసాయి రెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి, అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నానని చెప్పారు. మీ వెంటే నేనుంటా.. మీరు ఈ పోరాటాన్ని వదిలి పెట్టకండి. బుద్ధిలేని టీవీ ఛానెళ్లు ఆమె గ‌ర్భం దాల్చింద‌ని తెలీగానే ఎవ‌రి దగ్గరో డ‌బ్బు తీసుకుంద‌ని.. సేమ్ క‌థ‌ను రిపీట్ చేస్తున్నారు. నేను శాంతికి ఒక్కటే చెప్పాల‌నుకుంటున్నాను. నువ్వు ఏడిస్తే అది వారికి గెలుపు అవుతుంది. ఇలాంటి ఎద‌వ‌ల కోసం నీ క‌న్నీరును వృథా చేసుకోకు. నీకు న్యాయం జ‌రిగేలా చూసేందుకు నీ భ‌ర్త నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు అని పూనమ్ కౌర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. విజయ్‌సాయి రెడ్డిని సపోర్ట్‌ చేస్తూ పూనం చేసి ఈ ట్వీట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.