Karimnagar: భార్యను చంపి భర్త ఆత్మహత్య.. అంతులేని ప్రశ్నలు..

భార్యను చంపేసిన భర్త.. ఆ తర్వాత శవాన్ని ఇంట్లో దాచి కూతురిని చూడ్డానికి హాస్టల్‌ వెళ్లి.. తిరిగి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో భార్యభర్తల మృతదేహాలతో మార్కండేయ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 06:35 PM IST

Karimnagar: కరీంనగర్‌ మార్కేండేయ కాలనీలో దారుణం జరిగింది. భార్యను చంపేసిన భర్త.. ఆ తర్వాత శవాన్ని ఇంట్లో దాచి కూతురిని చూడ్డానికి హాస్టల్‌ వెళ్లి.. తిరిగి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో భార్యభర్తల మృతదేహాలతో మార్కండేయ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రవీణ్, లావణ్య దంపతులు కాగా, వీరికి ఓ కుమార్తె ఉంది. ఆమె హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. భార్యను రెండు రోజుల ముందే చంపేసి.. ఆమె శవాన్ని ఇంట్లోనే దాచేశాడు భర్త.

ఆ తర్వాత ఏమీ తెలియనట్లు.. హాస్టల్లో ఉంటున్న కూతురును చూసేందుకు హాస్టల్‌కు వెళ్లాడు. కూతురితో కాసేపు సమయం గడిపిన తర్వాత ఇంటికి చేరుకుని తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. క్షణికావేశంలోనే తన భార్యని ప్రవీణ్‌ చంపేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయిన భార్య శవాన్ని ఇంట్లోనే దాచేసి, రెండు రోజులు అలానే ఉన్నాడు. రెండు రోజులుగా ఇంటి నుంచి లావణ్య బయటకు రాకపోవటంతో.. ఇరుగుపొరుగు వాళ్లకు అనుమానం వచ్చి గమనించగా.. ఇంట్లో రెండు శవాలు కనిపించాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు. లావణ్యను రెండు రోజుల ముందే ప్రవీణ్ చంపేసినట్టు తేల్చారు. ఐతే లావణ్యను ప్రవీణ్‌ ఎందుకు చంపాడు..? నిజంగా వాళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా..? క్షణికావేశంలోనే చంపింది నిజం అయితే, తర్వాత అతనెందుకు సూసైడ్ చేసుకున్నాడు.

అసలు వాళ్లిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి..? చంపేసేంత గొడవలు ఇద్దరి మధ్య ఏమున్నట్లు..? భార్యను చంపేసిన తర్వాత రెండు రోజులు ఏం జరగనట్లు తిరిగి కూతురు హాస్టల్‌కు కూడా వెళ్లొచ్చిన ప్రవీణ్‌.. అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఈ రెండు ప్రాణాల చుట్టూ రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైనా తల్లిదండ్రులు దూరమై.. ఆ చిన్నారి కారుస్తున్న కన్నీరు ఇప్పుడు ప్రతీ ఒక్కరి మనసు కదిలిస్తోంది.