Cricket :బాలయ్య వాయిస్.. తమన్నా, రష్మిక డ్యాన్స్‌.. అదుర్స్ అనిపించేలా ఐపీఎల్‌ ఓపెనింగ్..

క్రికెట్‌ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైం రానే వచ్చింది. మార్చ్‌ 31 నుంచి ఐపీఎల్‌ సీజన్‌ 16 స్టార్ట్‌ కాబోతోంది. రెండున్నర నెలల పాటు క్రికెట్‌ లవర్స్‌కు ఇక పండగే పండగ. బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ సారి ఓపెనింగ్‌ సెర్మోనీ గ్రాండ్‌గా నిర్వహించున్నాయి.

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 09:00 PM IST

ఈ సెర్మోనీలో హీరోయిన్స్‌ రష్మక మందన, తమన్నా డాన్స్‌ పర్ఫార్మెన్స్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. నిజానికి ప్రతీ సీజన్‌లో ఓపెనింగ్‌ సెర్మోనీ, క్లోజింగ్‌ సెర్మోనీ గ్రాండ్‌గా నిర్వహించేవారు. చాలా మంది బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రెటీలు డాన్స్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చేవారు. కానీ దాదాపు నాలుగేళ్ల నుంచి సెలబ్రేషన్స్‌ లేకుండానే సీజన్స్‌ పూర్తి చేశారు.

2019లో పుల్వామా ఎటాక్‌లో మన సోల్జర్స్‌ చనిపోయిన కారణంగా సెలబ్రేషన్‌ క్యాన్సిల్‌ చేశారు. ఆ తరువాత మూడేళ్లు కరోనా కారణంగా సెలబ్రేషన్స్‌ లేకుండానే సీజన్‌లు గడిచిపోయాయి. 2022లో మాత్రం క్లోజింగ్‌ సెర్మోనీ జరిగింది. ఇందులో ఏఆర్‌ రెహమాన్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఇప్పుడు ఓపెనింగ్‌ సెర్మోనీ కూడా గ్రాండ్‌గానే నిర్వహించనున్నారు. సెర్మోనీలో పెర్ఫార్మెన్స్‌ ఇచ్చేందుకు రష్మిక, తమన్నా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఫస్ట్‌ డే మ్యాచ్‌కు బాలకృష్ణ కామెంటరీ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఈ సీజన్‌ క్రికెట్‌, సినీ అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపనుంది.