DELHI: రూ.350 కోసం బాలుడి దారుణ హత్య.. 60 సార్లు కత్తితో పొడిచి హత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మజ్దూర్ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి.. నిందితుడు పదిహేడేళ్ల బాలుడిని బిర్యానీ తినేందుకు డబ్బులు అడిగాడు. దీనికి ఆ బాలుడు నిరాకరించాడు. దీంతో బాలుడి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.

  • Written By:
  • Updated On - November 23, 2023 / 06:51 PM IST

DELHI: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. రూ.350 కోసం 17 ఏళ్ల మైనర్ బాలుడిని దారుణంగా పొడిచి హత్య చేశాడు నిందితుడు. అది కూడా 60 సార్లు పొడిచి చంపారు. ఈ దారుణం ఈశాన్య ఢిల్లీలో గత మంగళవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మజ్దూర్ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి.. నిందితుడు పదిహేడేళ్ల బాలుడిని బిర్యానీ తినేందుకు డబ్బులు అడిగాడు.

YS JAGAN: వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల.. బటన్ నొక్కి రిలీజ్ చేసిన జగన్..

దీనికి ఆ బాలుడు నిరాకరించాడు. దీంతో బాలుడి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తి తీసి దాడి చేశాడు. అలా ఏకంగా 50 నుంచి 60 సార్లు బాలుడిని పొడిచాడు. అప్పటికే బాలుడు మరణించాడు. బాలుడి దగ్గర ఉన్న రూ.350 తీసుకుని, నిందితుడు ఆనందంతో డ్యాన్స్ చేశాడు. డబ్బులు తీసుకున్న అనంతరం నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాడి సమయంలో నిందితుడు మద్యం సేవించి, మత్తులో ఉన్నాడు. మరణించిన బాలుడిని జఫ్రాబాద్ వాసిగా గుర్తించారు.

ఘటన సమచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి ముఖ, మెడ, చెవులు సహా శరీరంపై దాదాపు 60 వరకు కత్తిపోట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి, నిందితుడిని పట్టుకున్నారు.