Pushpa2 : పుష్ప 2లో 50 కోట్లతో హై ఓల్టేజ్ సీక్వెన్స్‌

పుష్ప‌-1 (Pushpa1) లాంటి భారీ హిట్ త‌ర్వాత స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి వ‌స్తున్న మూవీ పుష్ప‌-1..సుకుమార్ (Sukumar) డైరెక్ష‌న్‌లో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్లుగానే పుష్ప‌-2 ను భారీ లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్.. ఇక‌.. ఈ మూవీకి సంబంధించి వ‌స్తున్న అప్‌డేట్స్ త‌గ్గేదే లే అన్న రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పీక్స్‌కు తీసుకువెళ్తున్నాయి.

 

 

 

పుష్ప‌-1 (Pushpa1) లాంటి భారీ హిట్ త‌ర్వాత స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి వ‌స్తున్న మూవీ పుష్ప‌-1..సుకుమార్ (Sukumar) డైరెక్ష‌న్‌లో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్లుగానే పుష్ప‌-2 ను భారీ లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్.. ఇక‌.. ఈ మూవీకి సంబంధించి వ‌స్తున్న అప్‌డేట్స్ త‌గ్గేదే లే అన్న రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పీక్స్‌కు తీసుకువెళ్తున్నాయి. ఈ సినిమాలు కొన్ని ఊహించని సన్నివేశాలు కూడా భారీగా ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్.. ఇప్పటివరకు ఎటువంటి సినిమాలో లేనంత విధంగా చిత్రీకరిస్తున్నారట మేకర్స్. సుకుమార్ ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్ని ఒక ఎత్తు అయితే.. పుష్ప-2 (Pushpa2) మరో ఎత్తు అని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇంట‌ర్వెల్ ఎపిసోడ్‌కు సంబంధించి వినిపిస్తున్న ఓ లేటెస్ట్ బ‌జ్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింఇ..

ఇప్పటికే పుష్ప2 మూవీలోని జాతర యాక్షన్ సీన్ గురించే చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. ఇంటర్వెల్ సీన్ లోనే జాతరకు సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయని. కేవలం ఆ ఒక్క సీన్ కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారని.. ఇంకా ఆ సీన్ కోసం ఎక్కువ రోజులు టైం కూడా తీసుకుంటున్నారంటూ ర‌క‌రకాల వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా 25 నిమిషాల పాటు ఉండ‌నున్న‌ ఈ ఎపిసోడ్ కోసం మేక‌ర్స్ ఏకంగా 50 కోట్ల రూపాయల‌ను ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు వినిపిస్తున్న టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ ఒక్క ఎపిసోడ్ కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారంటే.. సుకుమార్ ఆ ఎపిసోడ్‌ను ఏ రేంజ్‌లో తీర్చిదిద్దుతున్నాడో అని ఫ్యాన్స్ అంచ‌నాలు వేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రత్యేకించి ఓ పాట, అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ తో ఉన్న సన్నివేశాలు.. థియేటర్ లో మాస్ జాతర చేయించ‌డం ఖాయ‌మ‌న్న టాక్ వినిపిస్తోంది.. ఆ సీన్స్ లో అల్లు అర్జున్ అర్ధ నారీశ్వరి అవతారంలో.. విలన్స్ ను చీల్చి చెండాడడమే కాకుండా ఉగ్రరూపంతో వేసిన స్టెప్పులు ఆడియ‌న్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయ‌ట‌.. దీంతో.. త‌గ్గేదేలే అంటూ బ‌న్నీ చేయ‌బోయే ర‌చ్చను థియేట‌ర్ల‌లో చూడ్డానికి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఏకంగా 50 కోట్లతో చేస్తున్న ఈ హై ఓల్టేజ్ సీక్వెన్స్ ఈ సినిమాకు ఎలాంటి రిజ‌ల్ట్ అందిస్తుందో చూడాలి మ‌రి..