మెగా ఫ్యాన్స్ కు పండుగే, గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్ పై క్లారిటీ

గేమ్‌ ఛేంజర్‌” మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సినిమా ఇది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 11:18 AM IST

గేమ్‌ ఛేంజర్‌” మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సినిమా ఇది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఆ తర్వాత రామ్ చరణ్ నుంచి ఏ సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత డైరెక్టర్ శంకర్ మరో సినిమా పూర్తి చేసి విడుదల చేసారు. కాని గేమ్‌ ఛేంజర్‌ మాత్రం ముందుకు అడుగులు పడలేదు అనే చెప్పాలి.

ఇప్పటికే ఆలస్యం అవుతోంది అనే ఆందోళన చిత్ర యూనిట్ లో కూడా ఉంది. దర్శకుడు కూడా మారే ఆవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వచ్చింది అంటున్నారు సినిమా జనాలు. ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా తమన్ పెట్టిన ఓ పోస్ట్ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు ఈవెంట్స్, ప్రచార చిత్రాలు ఉంటాయి. సిద్దంగా ఉండండి అంటూ పోస్ట్ చేసాడు.

దీనితో ఈ సినిమా విడుదల కచ్చితంగా డిసెంబర్ 20 అనే క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 26న పుష్ప సినిమా విడుదల కానుంది. ఒక రకంగా ఇది మినీ యుద్దమే అని చెప్పాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అల్లు అర్జున్ సినిమాలు మెగా ఫ్యాన్స్ చూసే అవకాశం కనపడటం లేదు. దీనితో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో యుద్ధం నడుస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిన విషయం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గనుక గేమ్‌ ఛేంజర్‌ ను టార్గెట్ చేస్తే మాత్రం కచ్చితంగా పుష్ప 2 ని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ఖాయంగా కనపడుతోంది.