రా ఏజెంట్‌గా సీమా హైదర్.. పబ్‌జీ ప్రేమ కథలో కొత్త మలుపు

పబ్‌జీ పరిచయం అయి.. మనసు పారేసుకొని.. కుటుంబాన్ని వదిలేసుకొని.. ప్రియుడి కోసం ఇండియా వచ్చిన ప్రేమకథలో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయ్.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 01:51 PM IST

పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌.. అక్రమంగా మనదేశంలోకి వచ్చింది. యూపీలోని యువకుడిని పెళ్లి చేసుకుంది. తంతే బూరల బుట్టలో పడినట్లు.. రాత్రికి రాత్రి దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది సీమా ! ఈ బజ్‌ను అందుకునేందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్లు పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే సీమా హైదర్‌కు సినిమా అవకాశాలు ఇస్తున్నారు. ఓ బాలీవుడ్ సినిమాలో నటించాలని ఇద్దరు దర్శకులు కాంటాక్ట్ అయ్యారు. సీమా నుంచి ఆడిషన్స్ కూడా తీసుకున్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ హత్య చుట్టూ జరిగిన కథతో.. ఆ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ఏ టైలర్ మర్డర్ స్టోరీ అనే పేరు కూడా ఖరారు చేశారు.

ఈ మూవీలో యాక్ట్ చేయాలని కోరుతూ.. జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం.. సీమాను కలిసింది. దీని కోసం ఆమె నుంచి ఆడిషన్స్ తీసుకుంది. ఈ మూవీలో.. సీమా హైదర్.. రా ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. ఐఎస్ఐ ఏజెంట్ అనే అనుమానంతో సీమా హైదర్‌ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాతే సినిమా ఆఫర్‌ను అంగీకరిస్తానని సీమా చెప్పినట్లు తెలుస్తోంది. ఎక్కడి పబ్‌జీ.. ఎక్కడి పరిచయం.. ఎక్కడి ప్రేమ.. ఒక్క కథలో ఇన్ని మలుపులా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ మూవీస్‌లో అవకాశం అంటే మాములు విషయం కాదు. అలాంటిది సీమా హైదర్‌కు ఈజీగా ఆ చాన్స్ వచ్చింది. బోర్డర్‌ దాటేప్పుడు ఏ నక్క తోకే తొక్కి ఉంటుంది సీమా హైదర్ అని జోకులు వేసుకుంటున్నారు నెటిజన్లు.