Aadikeshava: ఆదికేశవ.. ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‌ఫాంలో వస్తుందంటే..

సినిమాలో యాక్షన్, శ్రీలీల గ్లామర్ ఆకట్టుకుంటోంది. అయితే, కథ, కథనాలు మరీ పాత వాసన కొట్టడంతో ప్రేక్షకులకు ఓ మోస్తరుగానే నచ్చింది. ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే.. ఈ చిత్ర ఓటీటీ విడుదల.

  • Written By:
  • Publish Date - November 26, 2023 / 08:48 PM IST

Aadikeshava: ఇటీవలే విడుదలైన యాక్షన్ మూవీ ఆదికేశవ. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, సెన్సెషనల్ బ్యూటీ శ్రీలీల కాంబోలో తెరకెక్కింది ఈ చిత్రం. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. సినిమాలో యాక్షన్, శ్రీలీల గ్లామర్ ఆకట్టుకుంటోంది. అయితే, కథ, కథనాలు మరీ పాత వాసన కొట్టడంతో ప్రేక్షకులకు ఓ మోస్తరుగానే నచ్చింది. ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Mansoor Ali Khan: త్రిషకు మద్దతు.. చిరంజీవి, ఖుష్బూపై కేసు పెడతానంటున్న మన్సూర్ అలీ ఖాన్

అదే.. ఈ చిత్ర ఓటీటీ విడుదల. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. చిత్ర థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వచ్చే నెలలో ఈ సినిమా ఓటీటీలో విడుదలవ్వొచ్చు. వచ్చే క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తుందని తెలుస్తోంది. దీనిపై ప్రకటన రావడానికి కాస్త సమయం పడుతుంది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ 4 సినిమాస్ సంస్థ కలిపి నిర్మించాయి. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించాడు.

ఈ చిత్రంలో జోజు జార్జ్, సుమన్, రాధికా, సదా కీలక పాత్రలు పోషించారు. మలయాళ హీరో జోజు జార్జ్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు విలన్‌గా పరిచయమయ్యారు. ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.