Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లోకి శృంగార తార.. బుల్లితెరపై సంచలనమే..!

రెండు దశాబ్దాల క్రితం మలయాళ ఇండస్ట్రీలో షకీలా సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. అడల్డ్ మూవీస్‌తో షకీలా పేరు తెచ్చుకుంది. ఒక దశలో అక్కడి సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలకు మించి షకీలా మూవీస్ కలెక్షన్లు సాధించాయి

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 08:03 PM IST

Bigg Boss 7 Telugu: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్-7 వచ్చే వారమే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. గత రెండు సీజన్ల ఫలితాల దృష్ట్యా రాబోయే సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఈసారి వీలైనంత వరకు ప్రేక్షకులకు బాగా తెలిసిన సెలబ్రిటీలను మాత్రమే తీసుకోవాలని డిసైడయ్యారు. ఈ మేరకు కంటెస్టెంట్ల ఎంపిక పూర్తైంది. ఈ సారి ఒక సంచలన సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు.. బోల్డ్ మూవీస్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మలయాళ నటి షకీలా.
రెండు దశాబ్దాల క్రితం మలయాళ ఇండస్ట్రీలో షకీలా సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. అడల్డ్ మూవీస్‌తో షకీలా పేరు తెచ్చుకుంది. ఒక దశలో అక్కడి సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలకు మించి షకీలా మూవీస్ కలెక్షన్లు సాధించాయి. దీంతో వాళ్లే భయపడిపోయే పరిస్థితి తలెత్తింది. చివరకు షకీలాను అడ్డుకోవడానికి ఆమె చిత్రాల్ని నిషేధించాల్సి వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా షకీలా ప్రభావం తగ్గుతూ వచ్చింది. తర్వాత తెలుగుతోపాటు, ఇతర భాషల్లోనూ కొన్ని మంచి చిత్రాల్లో నటించింది. అయితే, ఫుల్ బిజీ ఆర్టిస్ట్ కాలేకపోయింది. అప్పుడప్పుడూ సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే, ప్రేక్షకుల్లో ఇప్పటికీ షకీలాకు ఒక గుర్తింపు ఉంది. ఇంతటి సంచలన తార ఇప్పుడు బుల్లితెరపై కనిపించబోతుంది. తెలుగులో స్టార్ మా ఛానెల్‌లో, వచ్చే వారం ప్రారంభం కానున్న బిగ్‌బాస్-7లో షకీలా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షోలో పాల్గొనేందుకు షకీలా అంగీకరించిందనే ప్రచారం కూడా జరుగుతోంది. సినిమాలతో, వివాదాలతోనూ పేరు తెచ్చుకున్న షకీలా.. బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తే పోటీ మామూలుగా ఉండదని ప్రేక్షకులు అంటున్నారు. షకీలా నిజంగానే హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తే.. ఈసారి షో మరింత రసవత్తరంగా మారడం ఖాయం. షకీలా ఎంట్రీ ఇస్తుందా.. లేదా.. తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.
ఇప్పటికే షోలో పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి షోలో పాల్గొనబోతున్న పోటీదారులకు సంబంధించి జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారం జరుగుతున్న పేర్లివి… ఆర్కే సాగర్ (మొగలి రేకులు ఫేం), టీవీ తారలు నవ్య స్వామి, శోభితా శెట్టి, అమర్ దీప్, అంజలి పవన్, ప్రభాకర్ సింగర్‌ శుభశ్రీ, సింగర్‌ దామిని, యూట్యూబర్ శీతల్‌ గౌతమన్‌, కమెడియన్‌ మహేష్‌, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్‌ (యూట్యూబర్‌), మై విలేజ్‌ షో అనిల్‌ గీలా, శ్వేతానాయుడు, సింగర్‌ మోహన భోగరాజు. వీరిలో ఎవరు నిజంగా పార్టిసిపేట్ చేస్తారో సీజన్ ప్రారంభమయ్యే వరకు తెలియదు.