SSMB29 : మహేష్ మూడేళ్లు ఆగాల్సిందే

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత సూపర్ స్టార్ (Superstar) మహేష్‌ బాబు (Mahesh Babu) తో రాజమౌళి (Rajamouli) చేయబోతున్న సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం మహేష్‌ ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత సూపర్ స్టార్ (Superstar) మహేష్‌ బాబు (Mahesh Babu) తో రాజమౌళి (Rajamouli) చేయబోతున్న సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం మహేష్‌ ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. కానీ జక్కన్న మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ (KL Narayana) భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ (Hollywood) రేంజ్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ లిమిటేడ్ బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే గ్రాండ్‌గా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. రాజమౌళి ఈసారి ప్రీ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాడని తెలుస్తోంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌ర్ఫెక్ట్ గా ఉంటే, షూటింగ్ ఈజీ అవుతుంది.అందుకే.. అంతా సెట్ అయ్యాకే సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట.

అయితే.. ఈ సినిమా రిలీజ్‌కు మాత్రం మరో మూడేళ్లు పడుతుందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. 2027 మొదటి త్రైమాసికంలో ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం గ్యారెంటీ. ఖచ్చితంగా ఇండియన్ సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లేలా మహేష్ బాబు ప్రాజెక్ట్ ఉండబోతోంది. ప్రస్తుతానికైతే.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణకు రామోజీ ఫిలిం సిటీలో 100 కోట్ల రూపాయలతో భారీ సెట్ వేస్తున్నట్టుగా సమాచారం