అక్కినేని ఫ్యామిలీకి సెంటిమెంట్ భయం…?

సోషల్ మీడియా జనాలకు ఇప్పుడు ఏది దొరికినా సరే దాని గురించి నానా హడావుడి చేస్తూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ విషయంలో కూడా అదే జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - September 6, 2024 / 07:25 PM IST

సోషల్ మీడియా జనాలకు ఇప్పుడు ఏది దొరికినా సరే దాని గురించి నానా హడావుడి చేస్తూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏ ముహూర్తంలో హైడ్రా అధికారులు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చారో తెలియదు గాని… అక్కడి నుంచి శోభితని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. శోభిత… నాగ చైతన్యతో నిశ్చితార్ధం చేసుకున్న తర్వాతనే ఇలా జరుగుతోంది అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

ఆక్రమణల పాపం కూడా శోభిత మీద నెట్టారు జనాలు. సమంతా ఉన్నప్పుడు… కూల్చే పరిస్థితి వచ్చినా ఆగిందని ఇప్పుడు మాత్రం ఆగలేదు అని… సమంతాతో పాటే అక్కినేని ఫ్యామిలీకి అద్రుష్టం కూడా వెళ్లిపోయింది అంటూ కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇప్పుడు నాగ చైతన్య హీరోగా వస్తున్న తండెల్ అనే సినిమా విషయంలో కూడా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. నాగ చైతన్యకు కొన్నాళ్ళుగా ఒక్క హిట్ కూడా లేదు. అసలు అక్కినేని ఫ్యామిలీకె సినిమాల్లో ఏ ఒక్కటి కూడా కలిసి రావడం లేదు.

నాగ చైతన్యతో పాటుగా అఖిల్, నాగార్జున కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పుడు నాగ చైతన్య చాలా జాగ్రత్తగా తండెల్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు హిట్ కాకపోతే మళ్ళీ శోభితని టార్గెట్ చేసే అవకాశం ఉండవచ్చు. వాస్తవానికి నాగ చైతన్యకు గత పదేళ్ళలో హిట్ వచ్చిన సినిమాల్లో సమంతానే ఎక్కువగా కనపడింది. ఆమెను ఫ్యాన్స్ కూడా లక్కీ ఫ్యాక్టర్ గా భావించారు. ఇప్పుడు పొరపాటున తండెల్ అటు ఇటు అయితే మాత్రం కచ్చితంగా శోభితని ట్రోల్ చేసే అవకాశం ఉండవచ్చు. కాగా నాగ చైతన్య సినిమాల్లోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ ఒక లుక్ ని సోషల్ మీడియాలో విడుదల చేసింది.