Akshay Kumar: తత్వం బోధపడిందా.. అక్షయ్‌ ఇక మల్టీస్టారర్‌ సినిమాలే..

బడే మియా చోటే మియా మూవీలో అక్షయ్ కుమార్‌తో పాటు టైగ‌ర్ ష్రాఫ్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో టైగ‌ర్‌కి జోడీగా జాన్వీక‌పూర్ నటిస్తుంటే.. అక్షయ్‌తో రొమాన్స్ చేయబోతోంది మానుషీ చిల్లర్. 1998లో వచ్చిన బడేమియా చోటేమియా సినిమాకి సీక్వెల్‌గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 07:05 PM IST

Akshay Kumar: మిషన్ రాణిగంజ్‌తో ట్రాక్‌ తప్పిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ఇప్పుడు కొత్త ప్లాన్ షురూ చేశాడు. అలీ అబ్బాస్ జాఫ‌ర్ డైరెక్షన్‌లో బడే మియా చోటే మియా సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా.. ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. బడే మియా చోటే మియా మూవీలో అక్షయ్ కుమార్‌తో పాటు టైగ‌ర్ ష్రాఫ్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో టైగ‌ర్‌కి జోడీగా జాన్వీక‌పూర్ నటిస్తుంటే.. అక్షయ్‌తో రొమాన్స్ చేయబోతోంది మానుషీ చిల్లర్.

Sreeleela: శ్రీలీలకి డేంజర్‌ బెల్స్ మోగుతున్నాయా..? వరుస ఫ్లాపులతో సాగుతున్న కెరీర్..

1998లో వచ్చిన బడేమియా చోటేమియా సినిమాకి సీక్వెల్‌గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. పాత సినిమాలో అమితాబ్ బచ్చన్, గోవింద కలిసి నటించారు. ఇప్పుడు ఆ స్థానంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కినిపించబోతున్నారు. ఇక బ‌డేమియా ఛోటేమియా షూటింగ్‌ని శరవేగంగా జరుపుతున్నాడు అలీ అబ్బాస్ జ‌ాఫ‌ర్. ప్రస్తుతం టైగర్, అక్షయ్‌పై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోస్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు డైరెక్టర్. C235 రంబుల్ ఇన్ ది స్కై అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇండియాలో ఏకధాటిగా 100 రోజుల పాటు షూట్ చేయ‌నున్నారు. సాంగ్స్ కోసం యూరప్‌, యూఏఈలో కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

అక్షయ్ చేసిన మిషన్ రాణిగంజ్, టైగర్ ష్రాఫ్ చేసిన హీరో పంత్ డిజాస్టర్స్ కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ మూవీ.. వచ్చే ఏడాది ఈద్ కానుకగా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది.