Allu Arjun: ప్రభాస్, తారక్, చరణ్‌ను కంగారు పెడుతున్న బన్నీ

పాన్ ఇండియాకే తొలి సూపర్ స్టార్ ప్రభాస్, తర్వాత గ్లోబల్ స్టార్ రామ చరణ్, అలానే దేశవ్యాప్తంగా ఫోకసైన మరో తెలుగు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్.. ఈ ముగ్గురూ.. రాజమౌళితో సినిమా చేయటం వల్లే పాన్ ఇండియా స్టార్లయ్యారు.

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 06:23 PM IST

Allu Arjun: అల్లు అర్జున్ ఏం చేసినా ఇప్పుడు తగ్గేదేలేదు అన్నట్లుంది ఆయన ఇమేజ్. ఈ హీరోని చూసి ఏకంగా ప్రభాస్, చెర్రీ, తారక్‌లే షాక్ అయ్యే పరిస్తితి వచ్చింది. సౌత్‌లో ఏ హీరోకి దక్కని ప్రత్యేక గుర్తింపు ఐకాన్ స్టార్‌‌కి దక్కింది. అందుకే తనలోని కొత్త కోణం మిగతా హీరోలని ఇన్ సెక్యూరిటీలోకి నెడుతోందనే కామెంట్స్ పెరిగాయి.

అసలు విషయం ఏంటంటే పాన్ ఇండియాకే తొలి సూపర్ స్టార్ ప్రభాస్, తర్వాత గ్లోబల్ స్టార్ రామ చరణ్, అలానే దేశవ్యాప్తంగా ఫోకసైన మరో తెలుగు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్.. ఈ ముగ్గురూ.. రాజమౌళితో సినిమా చేయటం వల్లే పాన్ ఇండియా స్టార్లయ్యారు. కాని అసలు రాజమౌళితో ఏ సినిమా చేయకుండా పుష్పతో సౌత్, నార్త్ అంతటా జనాల్లోకి దూసుకెళ్లిన హీరోగా బన్నీ ఆల్రెడీ ట్రెండ్ సెట్ చేశాడు. పొలిటీషియన్స్ అయితే పుష్ప అంటే ప్లవర్ కాదు ఫైర్ అనేడైలాగ్ ని సభల్లో కూడా వాడేసుకున్నారు. క్రికెటర్స్ ఈ సినిమా పాటల్ని, మాటల్ని ఇన్ స్టా రీల్స్ లో ఎలా వాడుకున్నారో చూశాం. లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్ టీం హైదరాబాద్ వచ్చి బన్నీ కోసం తన వన్ డే లైఫ్ మీద ఫోకస్ చేసిందంటే, బన్నీకి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దీనికి తోడు మొన్నీమధ్యే నేషనల్ అవార్డ్ తీసుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర స్రుష్టించాడు. ఇలా ఒక్కో విషయంలో బన్నీ లెక్కే వేరు. తనకి సొంతమైన రికార్డులు వేరు. ఇలాంటి వాటిలో ప్రభాస్, చెర్రీ,తారక్ మాత్రం వెనకబడ్డారు. ఇంకా జక్కన్న వల్లే వాళ్లు ఫోకస్ అయ్యారు. కాబట్టి, మరో దర్శకుడి మేకింగ్ లో ఇలాంటి సునామీనే క్రియేట్ చేస్తే తప్ప వాళ్లు బన్నీని రీచ్ కాలేరనే అభిప్రాయం పెరిగింది. ఐతే ఈ విషయంలో బన్నీ మాత్రం త్రివిక్రమ్ మేకింగ్‌లో పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామా, సందీప్ రెడ్డి మేకింగ్‌లో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా, బోయపాటి డైరెక్షన్‌లో ఊరమాస్ మూవీ ప్లాన్ చేసుకుంటూ తోటి తెలుగు హీరోలకి అందనంత ఎత్తుకి నిచ్చెనేస్తున్నాడు.