Allu Arjun: మహాభారతంలోని క్యారెక్టర్‌ చేస్తున్న అల్లు అర్జున్‌..

ఇప్పుడంటే పాన్‌ ఇండియా సినిమాలు వచ్చిన తరువాత చాలా మంది పాన్‌ ఇండియా హీరోలు అవుతున్నారు. కానీ ఈ పాన్‌ ఇండియా క్రేజ్‌ మొదలు కాకముందే నార్త్‌లో మంచి క్రేజ్‌ ఉన్న హీరో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. కేరళలో అల్లు అర్జున్‌ను మల్లు అర్జున్‌ అని అంటారు. ఇక పుష్ప సినిమాతో నార్త్‌లో బన్నీ క్రేజ్‌ డబులైంది.

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 04:37 PM IST

దీంతో ఇప్పుడు బాలీవుడ్‌ డైరెక్టర్స్‌ బన్నీ డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. పుష్ప సెకండ్‌ పార్ట్‌ కంప్లీట్‌ ఐన తరువాత బాలీవుడ్‌లో బన్నీ ఓ సినిమా తీస్తాడని చాలా కాలం నుంచీ టాక్‌ నడుస్తోంది. పదే పదే ముంబై వెళ్తేన్న బన్నీ రీసెంట్‌గా సంజయ్‌ లీలా బన్సాలిని కూడా కలిశాడట. ఆయనతో కలిసి సినిమా ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌.

ఇప్పుడు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఓ గాసిప్‌ సినీ వర్గాలను చుట్టేస్తుంది. యురి సినిమా డైరెక్టర్‌ ఆధిత్యధార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడట. మహాభారతంలోని అశ్వత్థామ క్యారెక్టర్‌ ఇన్సిపిరేషన్‌తో ఈ సినిమా చేస్తున్నారట. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాగా వస్తున్న ఈ సినిమాను పాన్‌ వరల్డ్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ది ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారట. పుష్ప సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ ఐన తరువాత ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారట.

పుష్ప సినిమా తరువాత సందీప్‌ రెడ్డి వంగతో అల్లు అర్జున్‌ ఓ సినిమా ప్లాన్‌ చేసినా.. ప్రభాస్‌తో సందీప్‌ ప్రాజెక్ట్‌ ఉంది. ఆ ప్రాజెక్ట్‌ తరువాత అల్లు అర్జున్‌ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ గ్యాప్‌లో ది ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ సినిమా కంప్లీట్‌ చేయాలి అనుకుంటున్నాడట అల్లు అర్జున్‌. మొదట ఈ రోల్‌ కోసం మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను అనుకున్నారట.

కానీ సినిమాలో క్యారెక్టర్‌కు తారక్‌ కంటే అల్లు అర్జున్‌ బాగా సెట్‌ అవుతాడని అనిపించడంతో అల్లు అర్జున్‌తో చర్చలు ప్రారంభించారట. ప్రస్తుతానికి టాక్స్‌ దశలోనే ఉన్నా.. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ఎనౌన్స్‌మెంట్‌ వస్తుందంటున్నారు. ఆధిత్యా ధార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ఉన్న ది ఇమ్మోర్టల్‌ అశ్వత్థామలో అల్లు అర్జున్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి.