Allu Arjun: పుష్ప2 రిలీజ్‌పై అదిరిపోయే అప్‌డేట్‌

పుష్ప-2 రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ చాలా రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యం అయిన పార్ట్ 2కు సంబంధించి మళ్లీ నటుడు జగదీశ్ వల్ల పోస్ట్ అవుతుందనడంతో ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చింది.

  • Written By:
  • Updated On - January 13, 2024 / 06:41 PM IST

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈచిత్రం కాస్తా ఆలస్యమైంది. దీంతో.. పుష్ప-2 రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ చాలా రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యం అయిన పార్ట్ 2కు సంబంధించి మళ్లీ నటుడు జగదీశ్ వల్ల పోస్ట్ అవుతుందనడంతో ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు.

GUNTUR KAARAM: సూపర్ స్టార్ మహేశ్‌ను ముంచిన త్రివిక్రమ్..

ఈ క్రమంలో చిత్ర బృందం రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ ‘పుష్ప2’ రిలీజ్ డేట్‌ను మరోసారి కన్ఫమ్ చేశారు. 2024 ఆగస్టు 15న మూవీ విడుదల అవుతుందని ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్‌కు అసిస్టెంట్‌గా నటించిన జగదీశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేశవ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండో పార్ట్‌లో కేశవ పాత్రనే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇంతలోనే ఓ యువతీ ఆత్మహత్య కేసులో జగదీష్ అరెస్ట్ కావడం ఆందోళనకరంగా మారింది. మూవీ షూటింగ్‌కు కూడా బ్రేక్‌లు పడ్డాయి. ఇప్పటికీ జగదీశ్ ఆ కేసునుంచి బయటపడలేదు. దీంతో సినిమా వాయిదా పడుతందున్న రూమర్లు కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. 2024 ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని ప్రకటించారు.

షూట్ మొత్తం మే 2024 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించి టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారట. ఈ అప్‌డేట్‌తో పుష్ప-2 ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా ఆడియన్స్‌లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.