వరద బాధితులకు రూ.5 లక్షలు విరాళం నువ్వు సూపర్‌ బంగారం

రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రాలో విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత దశాబ్ధంలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఈ రెండు జిల్లాల్లో కనిపిస్తోంది.

  • Written By:
  • Updated On - September 4, 2024 / 07:16 PM IST

రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రాలో విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత దశాబ్ధంలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఈ రెండు జిల్లాల్లో కనిపిస్తోంది. దీంతో వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. హీరోలు కూడా భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే టాప్‌ హీరోలంతా విరాళాలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరోయిన్‌ కూడా విరాళం ప్రకటించలేదు. కానీ ఒకేఒక్క హీరోయిన్‌ మాత్రం ముందూ వెనకా ఆలోచించకుండా 5 లక్షలు విరాళమిచ్చేసింది. ఏపీకి రెండున్నర లక్షలు, తెలంగాణకు రెండున్నర లక్షలు విరాళమిచ్చింది. ఆవిడే అనన్య నాగళ్ల. నిజానికి అనన్య నాగళ్ల పెద్ద స్టార్‌డం ఉన్న హీరోయిన్‌ కాదు. పదుల సంఖ్యలో సినిమాలు చేయలేదు. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకోవడంలేదు. కానీ ఎవరూ ముందుకు రాకపోయినా.. తాను మాత్రం తనకు చేతనైన సాయం చేసింది. అనన్యది పెద్ద ఫైనాన్షియల్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ కాదు. చాలా మంది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌లో అనన్య ఫ్యామిలీ కూడా ఒకటి. సినిమాల్లోకి రాకముందు కూడా అందరు అమ్మాయిల్లానే తాను కూడా జాబ్‌ చేసేది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ సాధారణ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్‌లానే ఉండేది అనన్య. కానీ ఆమె టాలెంట్‌ ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చింది. అలా అని సినిమాల్లో కోట్లకు కోట్లు సంపాదించిందా అంటే.. అదీ లేదు. కానీ పక్కవాడికి కష్టం వచ్చినప్పుడు తనకు చేతనైన సాయం చేసి స్టార్‌ హీరోయిన్స్‌ కంటే ఎక్కువ రెస్పెక్ట్‌ ఇప్పుడు పబ్లిక్‌లో సంపాదించుకుంది అనన్య. తెలుగులో సినిమాలు చేసి కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్న స్టార్‌ హీరోయిన్లు ఎవ్వరూ కనీసం వరదల గురించి పోస్ట్‌ కూడా పెట్టలేదు. కానీ ఏకంగా 5 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు డొనేట్‌ చేసి తాను ఔట్‌ సైడే కాదు ఇన్‌ సైడ్‌ కూడా బ్యూటీనే అని నిరూపించుకుంది అనన్య నాగళ్ల.