Mahesh Babu: కోపంతో పూజాని గెంటేసిన మహేశ్ బాబు.. నెక్ట్స్ తమన్.. !

మహేశ్ బాబు అన్నంత పని చేశాడు. గుంటూరు కారం మూవీ నుంచి పూజా హెగ్డేని ఆల్ మోస్ట్ గెంటేశాడు. ఏదో డేట్లు అడ్జెస్ట్ కాక పూజా హోగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్లిందంటున్నారు. కాని తనేం చాలా సినిమాలు చేస్తూ బిజీగా లేదు. చేసేదే ఒకే ఒక్క గుంటూరు కారం మూవీ. ఆ సినిమాకి డేట్లు అడ్జెస్ట్ కాకబయటికి రావటం ఏంటి? ఇందత కవరప్ అనే అంటున్నారు.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 05:01 PM IST

సరే అది అందరికీ అర్ధమైపోతున్న మ్యాటరే. కాని సూపర్ స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ మీద ఎంత ఫైర్ అవుతున్నాడో ఇప్పుడిప్పడే ఇండస్ట్రీకి అర్ధమౌైతోంది. కథ సరిగా రాయక, రాసిన కథలో క్లారిటీ లేక, పూజా హెగ్డే సీన్లు తీయక ఇలా తికమక పెట్టిన త్రివిక్రమ్ మాట విని పరిస్తితిలో మహేశ్ లేడు.

అందుకే కేవలం ఐరన్ లెగ్ అని కాదుకాని, పూజా హెగ్డేని మరీ త్రివిక్రమ్ పాంపర్ చేసి, సినిమామీదకంటే హీరోయిన్ మీద, లేదంటే పవన్ మీదే ఫోకప్ పెట్టాడనే గుసగుసలతో మహేశ్ సీరియస్ అయ్యాడు. పూజాని ఇంటికి పంపించేశాడు. ఇక మిగిలింది తమన్ వంతే అంటున్నారు. లేజీ నెస్ కి తమన్ కేరాఫ్ అడ్రస్ అని మొదట్నుంచి మహేశ్ తనమీద గుర్రుగా ఉన్నాడు. ఇప్పుడు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న తను, తమన్ ని కూడా ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పించేయ బోతున్నాడు. సీన్ లోకి సంతోష్ నారాయన్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.