ANIMAL: 4 గంటల యానిమల్.. సందీప్ రెడ్డి కొత్త నిర్ణయం

డంకీ సోసోగా ఆడటం వల్లే అది ఆడే థియేటర్స్‌లో కొన్ని స్క్రీన్లు సలార్‌కి, మరికొన్ని స్క్రీన్లు యానిమల్‌కి వెళుతున్నాయట.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 04:45 PM IST

ANIMAL: యానిమల్ మూవీ ముందు ప్లాప్ అన్నారు. తర్వాత హిట్ అయ్యింది. రూ.800 కోట్ల క్లబ్‌లో చేరాక.. సలార్, డంకీ రాకతో ఇది 900 కోట్లను రీచ్ అవ్వటమే కష్టమన్నారు. కానీ, వెయ్యికోట్ల వసూళ్లు మరో వారంలో ఖాయం కాబోతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖానే.

SALAAR: మూడు రోజుల్లో 400 కోట్లు.. వెయ్యి కోట్లు సాధ్యమేనా..?

తన మూవీ డంకీ సోసోగా ఆడటం వల్లే అది ఆడే థియేటర్స్‌లో కొన్ని స్క్రీన్లు సలార్‌కి, మరికొన్ని స్క్రీన్లు యానిమల్‌కి వెళుతున్నాయట. మొన్నటి వరకు సలార్, డంకీ ఎటాక్‌తో యానిమల్ వసూళ్లకు గండి పడేలా ఉందన్నారు. అలానే సీన్ కూడా ఉంది. కాని సలార్ హిట్టైంది. డంకీ డిమ్కీ కొట్టింది. డంకీ ఆడే థియేటర్స్‌లో టిక్కెట్స్ సేల్ 70 శాతం తగ్గిందట. దీంతో ఆ మూవీని తీసేసి సలార్, లేదంటే యానిమల్‌ని వేయాలనుకుంటున్నారు. అలా యానిమల్‌కి కాలం కలిసొచ్చింది. రూ.900 కోట్ల వద్దే ఆగాల్సిన వసూళ్ల ప్రవాహం ఈ వారంలోనే వెయ్యికోట్లు దాటనుందట.

అంతేకాదు వెయ్యికోట్లు దాటాకే యానిమల్‌ని ఓటీటీలో రిలీజ్ చేస్తారట. ఇక ఓటీటీలో వచ్చే యానిమల్ మాత్రం మూడున్నర గంటలు కాకుండా 4 గంటల నిడివితో రానుందట. ఆల్రెడీ తీసేసిన సీన్లు, సెన్సార్ వాళ్లు కత్తిరించిన సీన్లు కలిపి ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. అలా కొత్త యానిమల్‌ని చూపించేందుకు ఓటీటీ ప్లాట్ ఫాంలో సరికొత్త దాడి ప్లాన్ చేశాడు సందీప్.