Atlee Kumar: ఇంకా జవాన్ మూవీ పనిలోనే ఉన్న అట్లీ..!

డైరెక్టర్ అట్లీ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీతో సినిమాను కన్ఫర్మ్‌ చేయలేదు. బన్నీతో మంచి ఫ్రెండ్‌షిప్‌ వుందని.. కాంబినేషన్‌ సెట్‌ కావడానికి దేవుడి ఆశీస్సులు కావాలన్నాడు అట్లీ. జవాన్‌ ఘనవిజయంతో జవాన్‌2 పై దృష్టి పెట్టాడు అట్లీ.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 09:07 PM IST

Atlee Kumar: జవాన్‌ హిట్‌ తర్వాత అట్లీ బన్నీని డైరెక్ట్‌ చేస్తున్నాడంటూ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే.. ఇప్పట్లో బన్నీతో సినిమా లేదు. జవాన్‌ రూ.వెయ్యి కోట్ల వైపు పరుగెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు దాటేసింది. పటాన్‌ రూ.1100 కోట్ల వసూళ్లను ఇంకో నాలుగైదు రోజుల్లో క్లాస్‌ చేస్తుందని అంచనా. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన అట్లీ నెక్ట్స్‌ ఎవర్ని డైరెక్ట్‌ చేస్తాడని అందరూ ఎదురుచూస్తుంటే.. బన్నీతో అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీతో సినిమాను కన్ఫర్మ్‌ చేయలేదు.

బన్నీతో మంచి ఫ్రెండ్‌షిప్‌ వుందని.. కాంబినేషన్‌ సెట్‌ కావడానికి దేవుడి ఆశీస్సులు కావాలన్నాడు అట్లీ. జవాన్‌ ఘనవిజయంతో జవాన్‌2 పై దృష్టి పెట్టాడు అట్లీ. సీక్వెల్‌ను పాన్‌ ఇంటర్నేషనల్‌ మూవీగా తీసుకెళ్తానని.. కథ రెడీ చేసి షారూక్‌ను వినిపిస్తానన్నాడు అట్లీ. కథ నచ్చాలేగానీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన అట్లీకి షారూక్‌ డేట్స్ ఇచ్చేస్తాడు. ఇదే ధీమాతో సీక్వెల్‌ కథ రెడీ చేయనున్నాడు అట్లీ. ఓటీటీ ప్రేక్షకుల్లో కొంతమంది జవాన్‌ను చూసేశారు. మరి సినిమా ఓటీటీలో స్ట్రీమ్‌ అయితే.. ఎంతమంది చూస్తారన్న డౌట్‌ నెట్‌ఫ్లిక్‌కు వచ్చినట్టుంది. జవాన్‌ను థియేటర్స్‌లో చూసినా.. ఓటీటీలో చూడాల్సిందే అన్న మైండ్‌సెట్‌తో ఆడియన్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ ప్రిపేర్‌ చేస్తోంది. ఓటీటీ రిలీజ్‌‌కు సంబంధించి దర్శకుడు అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన నిడివి, ఎమోషన్స్‌‌తో జవాన్‌ను థియేటర్లలో విడుదల చేశాం. ఓటీటీ రిలీజ్‌కు వచ్చేసరికి ఇంకాస్త రిథమ్‌ యాడ్‌ చేస్తున్నామన్నాడు.

దీంతో.. డిలీటెడ్‌ సీన్స్‌ను యాడ్‌ చేసి ఓటీటీలో జవాన్‌కు హైప్‌ తీసుకొస్తున్నారు. అట్లీ మూడున్నరేళ్ల నుంచి జవాన్‌తో ట్రావెల్‌ అవుతున్నాడు. రిలీజ్‌ తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్లాలని.. 4 నెలలపాటు సినిమా ప్రపంచానికి దూరంగా వుండాలనుకుంటే.. ఓటీటీ రిలీజ్‌ కోసం సీన్స్‌ కలపాల్సి రావడంతో.. హాలిడేట్‌ ట్రిప్‌ను అట్లీ పోస్ట్‌పోన్‌ చేసుకున్నాడు. జవాన్‌ను థియేటర్‌లో చూసి.. మళ్లీ ఓటీటీలో చూసేంత సినిమా కాదని మేకర్స్‌కు కూడా తెలుసు. అందుకే.. డిలీటెడ్‌ సీన్స్‌తో ఎట్రాక్ట్ చేస్తున్నారు.