Baby Movie: కొత్త సమస్య.. ‘బేబీ’ సినిమా కథ నాదే.. పోలీసులకు ఫిర్యాదు!

2023లో విడుదలైన ‘బేబి’ చిత్రం పెద్ద విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆ సినిమా కథ తనదేనంటూ శిరిన్‌ శ్రీరామ్‌ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు.

  • Written By:
  • Updated On - February 10, 2024 / 02:46 PM IST

Baby Movie: 2023లో విడుదలైన ‘బేబి’ చిత్రం పెద్ద విజయం సాధించింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా యూత్‌కు తెగ నచ్చేసింది. దీంతో 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బేబీ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.90 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రిలీజై రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కుంది.

Pushpa 2: పుష్ప ఫీవర్.. ‘పుష్ప 2’ మామూలుగా ఉండదట

ఆ సినిమా కథ తనదేనంటూ శిరిన్‌ శ్రీరామ్‌ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు. ఈ చిత్రాన్ని సాయిరాజేష్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌. నిర్మించారు. 2013లో డైరెక్టర్‌ సాయిరాజేష్‌తో తనకు పరిచయం ఏర్పడిందని.. ఆ సమయంలో తన సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని రాజేష్‌ కోరాడని.. ఆ విధంగా అతనితో తనకు పరిచయం ఏర్పడిందచి శ్రీరామ్‌ చెబుతున్నాడు. ఆ సమయంలో ‘బేబి’ స్టోరీ చెప్పానని, దర్శక నిర్మాతలు కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తున్నాడు శ్రీరామ్‌. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం.. 2015లో ‘కన్నా ప్లీజ్‌’ అనే టైటిల్‌తో శ్రీరామ్‌ ఒక కథ రాసుకున్నాడు. దాన్ని సినిమాగా తీసే క్రమంలో ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్‌ను అనుకున్నారు.

సాయిరాజేష్‌ సూచన మేరకు ఈ కథను నిర్మాత ఎస్‌కెఎన్‌కు శ్రీరామ్‌ వినిపించాడు. ఇప్పుడదే కథని తీసుకొని ‘బేబి’ అనే టైటిల్‌తో సినిమా తీశారు. ఈ సినిమా కథ మొత్తం ‘ప్రేమించొద్దు’ అనే పేరుతో తను రాసిన కథేనని శ్రీరామ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.