బిగ్ బ్రేకింగ్: లడఖ్ పారిపోయిన జానీ మాస్టర్

రెండు రోజుల నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. జూనియర్ డాన్సర్ ను రేప్ చేసాడనే అంశంలో ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జానీ మాస్టర్ ను పోలీసులు రెండు రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 04:24 PM IST

రెండు రోజుల నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. జూనియర్ డాన్సర్ ను రేప్ చేసాడనే అంశంలో ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జానీ మాస్టర్ ను పోలీసులు రెండు రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాధితురాలు సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఈ కేసు విషయంలో పోలీసులు సీరియస్ గా ఉన్నారు. అసలు జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు అనేది స్పష్టత రావడం లేద్హు.

ఈ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినా జానీ మాస్టర్ అందుబాటులో లేడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన వార్తల ప్రకారం జానీ మాస్టర్ కారులో లడఖ్ పారిపోయినట్టు సమాచారం. కేసు పెట్టిన వెంటనే స్నేహితుడి కారు తీసుకుని లడఖ్ వెళ్ళాడని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి పూణే అక్కడి నుంచి గుజరాత్… గుజరాత్ నుంచి రాజస్థాన్, రాజస్థాన్ మీదుగా హర్యానా, హర్యానా మీదుగా పంజాబ్ అలా జమ్మూ కాశ్మీర్ కి పారిపోయినట్టుగా తెలుస్తోంది.

జమ్మూ మీదుగా శ్రీనగర్ చేరుకొని అక్కడి నుంచి లడఖ్ వెళ్ళాడని సమాచారంతో పోలీసులు లడఖ్ చేరుకున్నారు. కార్గిల్ నుంచి లడఖ్ వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన భార్య, మరో స్నేహితుడితో కలిసి జానీ మాస్టర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక పోలీసు బృందం లడఖ్ చేరుకుందనే వార్తలతో ఇప్పుడు జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. ఫ్లైట్ లో వెళ్తే దొరికిపోయే అవకాశం ఉండటంతోనే జానీ మాస్టర్ రోడ్డు మార్గంలో వెళ్ళాడని అంటున్నారు. తన కారు కాకుండా మిత్రుడి కార్ లో వెళ్లినట్టుగా సమాచారం. ఇక ఈ కేసు విషయంలో సినిమా పెద్దలు కూడా సీరియస్ గా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోతోంది.