Bigg Boss Season 7 : బిగ్ బాస్ సీజన్ 7 లో ఫినాలే రేస్ లో కుమ్మేసిన అమర్, ప్రశాంత్ ..

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న 8 మంది టైటిల్ రేసు కోసం తెగ కష్టపడుతున్నారు. ఓట్లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ కు చేరుకునేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్.

 

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న 8 మంది టైటిల్ రేసు కోసం తెగ కష్టపడుతున్నారు. ఓట్లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ కు చేరుకునేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్. ఊహించని ట్విస్ట్‌లు ఊహకందని మలుపులతో రసవత్తరంగా టాస్క్ కొనసాగుతోంది. టాస్క్‌ టాస్క్‌కి లెక్కలు మారిపోతున్నాయి. ప్రియాంక, శివాజీ, శోభాలు, యావర్ లీస్ట్ స్కోర్‌తో రేస్ నుంచి తప్పుకున్నారు. ఇక రీసంట్ ఎపిసోడ్‌లో స్కోర్ బోర్డ్‌లోని ప్లేస్‌లు తారుమారయ్యాయి.

ఫినాలే టికెట్ కోసం పోటీపడుతున్న ఐదుగురు ఇంటిసభ్యులకు టర్నింగ్ వికెట్ అనే క్రికెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . గార్డెన్ ఏరియాలో ఓ సర్కిల్ తిరుగుండగా…. రింగ్స్ ను వికెట్లపై విసరాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కువ వికెట్లు పడతాయో.. ఆ వికెట్‌పై సూచించిన స్కోర్ వాళ్ల సొంతం అవుతుంది. ఈ టాస్క్‌లో అర్జున్ విన్నర్ గా నిలిచాడు. ఆతర్వాత తప్పించుకో రాజా అంటూ మరో టస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా.. గొట్టంలో ఇసుక వేసి.. దాన్ని తొలచుకుని అవతలికి వెళ్లి గంట కొట్టాలి. ఈ టాస్క్ లో ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. లిస్ట్ లో ఉన్న యావర్ తప్పుకుని.. తన పాయింట్స్ ను ప్రశాంత్ కుఇచ్చాడు.

నెక్స్ట్ టచ్ అండ్ గెస్ గేమ్ ను ఇచ్చాడు బిగ్ బాస్ .ఈ గేమ్ లో అమర్, ప్రశాంత్, అర్జున్ , గౌతమ్ లు పోటీ పడ్డారు. అమర్ ఆటలో అదరగొట్టేశాడు. టాస్క్ లో భాగంగా చికెన్ ఇవ్వగా.. చికెన్ తీసుకుందామా అని యావర్ తో శోభా అనగా.. బిగ్ బాస్ కల్పించుకొని.. చికెన్ తీసుకొని, తన ప్లేట్ తనకు ఇవ్వమని చెప్పగా అందరూ నవ్వేశారు. ఈ గేమ్ లో అమర ఎక్కువ పాయింట్లు సాధించాడు. అయితే యావర్ శివాజీ అమర్ కు కనిపించడం వల్లే విన్నర్ అయ్యారని కామెంట్స్ చేయగా.. అమర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇది ఇలా ఉండగానే.. వదలకు రా తడవకు రా అనే మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బాల్ ను చేతిలో పట్టుకుని బ్యాలెన్స్ చేయాలన్నాడు. ఈ టాస్క్ లో ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. దీంతో ప్రశాంత్, అమర్ సేమ్ పాయింట్ తో పోటీకి దిగారు. మరి ఫైనల్ గా ఫినాలే టికెట్ ఎవరికి దక్కుతుందోచూడాలి.