బ్రేకింగ్: రాజ్ తరుణ్ దే తప్పు, తేల్చేసిన పోలీసులు

హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు చేసారు. చార్జ్ షీట్ రాజ్‌తరుణ్‌ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పదేళ్ల పాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - September 6, 2024 / 12:37 PM IST

హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు చేసారు. చార్జ్ షీట్ రాజ్‌తరుణ్‌ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పదేళ్ల పాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేసారు. విచారణలో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు.

ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి ఈ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒక హీరోయిన్ తో రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఆరోపించింది. తనతో కలిసి సినిమా చేసిన హీరోయిన్ తో కలిసి ఉంటున్నాడని ఆమెతో కలిసి పలు ప్రాంతాల్లో తిరిగాడు అని లావణ్య పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసింది.