బోయపాటికి చిరంజీవి చాలెంజ్, దమ్ముంటే రెడీ చేసుకో

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలయ్య బాబు కలిసి నటిస్తే...? ఇంద్ర, సమరసింహా రెడ్డి లాంటి క్యారెక్టర్ లు ఒకటే స్క్రీన్ పై ఉంటే...? ఆ సినిమా చూడటానికి రెండు కళ్ళు సరిపోతాయా...? ఆ సినిమా చూసే అభిమానుల కోసం థియేటర్లు సరిపోతాయా...?

  • Written By:
  • Publish Date - September 2, 2024 / 12:56 PM IST

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలయ్య బాబు కలిసి నటిస్తే…? ఇంద్ర, సమరసింహా రెడ్డి లాంటి క్యారెక్టర్ లు ఒకటే స్క్రీన్ పై ఉంటే…? ఆ సినిమా చూడటానికి రెండు కళ్ళు సరిపోతాయా…? ఆ సినిమా చూసే అభిమానుల కోసం థియేటర్లు సరిపోతాయా…? అలాంటి రోజు వస్తే… తెలుగు సినిమా పరిశ్రమకు సరికొత్త రికార్డులు పరిచయం అయినట్టే కదా…? ఇప్పుడు దానికి నేను రెడీ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. నందమూరి బాలకృష్ణ సిని స్వర్ణోత్సవ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

తన ఇంద్ర సినిమాకు స్ఫూర్తి బాలకృష్ణ నటించిన సమరసింహా రెడ్డి అన్నారు చిరూ. ఆ పాత్ర చూసి తాను కూడా అలాంటి సినిమా ఒకటి చెయ్యాలని అనుకున్నా అంటూ చిరంజీవి మొదటిసారి బయటపెట్టారు. ఆ పాత్ర తనకు వచ్చినప్పుడు ముందు భయపడినా బాలయ్యను చూసి ధైర్యం తెచ్చుకుని చేసినట్టు చిరంజీవి వెల్లడించారు. ఇప్పుడు అందరూ సీక్వెల్స్, ప్రీక్వేల్స్ అంటూ తీస్తున్నారని కాని ఇంద్ర, సమరసింహా రెడ్డి సినిమాల్లో హీరోల పాత్రల ఆధారంగా ఒక కథ రాస్తే తాను సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నా అన్నారు.

బాలకృష్ణను వెంటనే మీరు సిద్దమా అని చిరూ అడగగా బాలయ్య కూడా వెంటనే ఓకే అన్నారు. ఇక బోయపాటికి చిరంజీవి చాలెంజ్ విసిరారు. కథ రెడీ చేసుకోవాలని కోరారు. స్వయంగా మెగాస్టార్ చెప్పడంతో ఆ కథ కచ్చితంగా బోయపాటి రెడీ చేసుకునే అవకాశం ఉందంటున్నారు సినీ జనాలు. ఫ్యాక్షన్ కథలతో సినిమాలు చేయడంలో బోయపాటి దిట్ట. అలాంటి బోయపాటికి ఇలాంటి ఓపెన్ ఆఫర్ వస్తే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరీ చిరంజీవి విసిరిన చాలెంజ్ ను బోయపాటి స్వీకరించి కథ రాస్తారా లేదా అనేది చూడాలి. ఫ్యాన్స్ అయితే ఆ సినిమాకు బీ గోపాల్ సహకారం తీసుకోవాలని కోరుతున్నారు.