Chiranjeevi: నడుం సీన్ నాశనం చేసిన చిరు.. చెడగొట్టావ్‌ కదా అన్నయ్యా..!

చిరు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐతే సినిమాలో చిరు యాక్టింగ్‌ కొద్దిగా అతిగా ఉంది. ఇది అభిమానులు చెప్తున్న మాటే. అసలు సినిమా ఎందుకు తీశారు అనేలా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 05:06 PM IST

Chiranjeevi: చిరు హీరోగా వచ్చిన భోళాశంకర్ ఫ్లాప్‌ మాత్రమే కాదు.. అంతకుమించి అంటున్నారు సినిమా చూసిన వాళ్లంతా! మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. తమిళ్‌లో అజిత్ యాక్ట్ చేసిన వేదాళం సినిమాకు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. చిరు సరసన తమన్నా నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా బోల్తాపడింది.

చిరు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐతే సినిమాలో చిరు యాక్టింగ్‌ కొద్దిగా అతిగా ఉంది. ఇది అభిమానులు చెప్తున్న మాటే. అసలు సినిమా ఎందుకు తీశారు అనేలా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో చిరు.. కామెడీ టైమింగ్ బావుంటుందని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. ఐతే కథనే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఆయన కామెడీని తట్టుకోవడం కష్టమే. పవన్ పరువు తీసేసినట్లు చిరును, మెహర్‌ను ఏకిపారేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకు కారణం ఖుషీ నడుము సీన్‌ను రీక్రియేట్ చేసి, దానికి ఉన్న ఇమేజ్‌ చెడగొట్టారని చెప్పుకొస్తున్నారు. పవన్, భూమిక జంటగా నటించిన ఖుషీ సినిమా గురించి అందులో ఉన్న నడుము సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భూమిక నడుమును పవన్ చూసే సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవడమే కాదు ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా కొనసాగుతోంది.

ఐతే భోళా శంకర్ షూటింగ్ నడుస్తున్న సమయంలోనే ఈ సీన్‌ను రీ క్రియేట్ చేస్తున్నట్లు వార్తలు రావడం, అందులోనూ శ్రీముఖితో చిరు ఈ సీన్ చేయడం అనేది చిరు ఫ్యాన్స్‌కు డైజెస్ట్ కాలేదు. పవర్‌స్టార్ ఫ్యాన్స్ బహిరంగంగానే వ్యతిరేకించారు. ఐనా చిరు, మెహర్‌ వెనక్కి తగ్గలేదు. ఖుషీ సీన్ చేశారు. ఆ ఫీలింగ్‌కు దినం పెట్టారు. చిరు చేసిందే ఓవరాక్షన్ అనుకుంటే.. భూమిక స్థానంలో శ్రీముఖిని ఊహించుకోవడం.. మందులేసుకోకుండానే వికారం వచ్చినంత పని చేసింది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.