ప్రీ రిలీజ్ అంటే ఇది… దేవరకు ఎవరెవరు వస్తున్నారో తెలుసా…?

ఏదేమైనా దేవరకు వస్తున్న ఊపు మాత్రం ఓ రేంజ్ లో ఉంది. సినిమా విడుదలకు ముందే రికార్డులను సముద్రంలో కలుపుతూ కొత్త రికార్డులను తన ఖాతాలో వేస్తోంది దేవర.

  • Written By:
  • Publish Date - September 20, 2024 / 01:30 PM IST

ఏదేమైనా దేవరకు వస్తున్న ఊపు మాత్రం ఓ రేంజ్ లో ఉంది. సినిమా విడుదలకు ముందే రికార్డులను సముద్రంలో కలుపుతూ కొత్త రికార్డులను తన ఖాతాలో వేస్తోంది దేవర. ఎన్టీఆర్ సినిమాకు గతంలో ఎప్పుడూ లేని క్రేజ్ ఇది. విదేశాల్లో ఎన్టీఆర్ సినిమాకు ఈ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతోంది అని కూడా జనాలు ఊహించలేదు. కాని ఇప్పుడు దేవర మాత్రం విదేశాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇక ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

అందుకోసం ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తోంది దేవర టీం. ఇందుకోసం స్టార్లను ఆహ్వానించాలని భావిస్తోంది. మరో రెండు రోజుల్లో జరిగే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు… రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఆహ్వానించాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళితో ఎన్టీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే దేవర టీం నుంచి ఆహ్వానం వెళ్ళగానే జక్కన్న వస్తాను అనే క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ చేసిన ఆరవింద సమేత సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఈ ముగ్గురిని ఈవెంట్ కి ఆహ్వానించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఇక కొందరు స్టార్ హీరోలతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. ఇంటర్వ్యూలు అనుకున్న విధంగా లేకపోవడంతో కాస్త నెగటివ్ టాక్ వెళ్ళింది. దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మార్చాలని దేవర టీం పట్టుదలగా ఉంది. అదే రోజు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ కూడా ఉండే అవకాశం ఉంది. బాలీవుడ్ నుంచి కూడా కొందరిని ఆహ్వానించే ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.