Pushpa-2‌: దేవిశ్రీ లీకులు.. ‘పుష్ప 2’ని ఆకాశానికెత్తేస్తున్న దేవిశ్రీ..

‘పుష్ప 1’ పాన్ ఇండియా లెవెల్‌లో భారీ విజయాన్ని సాధించడంతో.. ‘పుష్ప 2’ని అత్యంత భారీ బడ్జెట్‌తో సమ్‌థింగ్ స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్. లేటెస్ట్‌గా ‘పుష్ప 2’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 02:29 PM IST

Pushpa-2‌: కొన్ని కాంబినేషన్స్‌‌లో రూపొందే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబోనే అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్. ‘ఆర్య’తో మొదలైన వీరి ముగ్గురి ప్రస్థానం.. ఆ తర్వాత ‘ఆర్య 2, పుష్ప 1’తో పీక్స్‌కు చేరింది. ఇప్పుడు ‘పుష్ప 2’తో వీరు సృష్టించే సంచలనాలు మరో రేంజులో ఉండబోతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ‘పుష్ప 1’ పాన్ ఇండియా లెవెల్‌లో భారీ విజయాన్ని సాధించడంతో.. ‘పుష్ప 2’ని అత్యంత భారీ బడ్జెట్‌తో సమ్‌థింగ్ స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్.

Mahesh Babu: విదేశీ టూర్.. ఒకే చోట మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సందడి..

లేటెస్ట్‌గా ‘పుష్ప 2’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌. సుకుమార్ అంటేనే స్క్రీన్ ప్లే మాంత్రికుడు. ఇక.. ‘పుష్ప 2’ చిత్రాన్ని సుక్కూ చాలా బ్రిలియంట్‌గా తీర్చిదిద్దుతున్నాడని దేవిశ్రీ లీక్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రతీ సీక్వెన్స్ భారీ స్థాయిలో ఉంటుందని.. ఇదే ఇంటర్వెల్ అన్నంత లెవెల్లో ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ‘పుష్ప 2’ని ఆకాశానికెత్తేశాడు డీఎస్పీ. ప్రస్తుతం ‘పుష్ప 2’కి సంబంధించిన కీలకమైన జాతర సీక్వెన్స్ చిత్రీకరికరించారని.. ఆ సీక్వెన్స్ నెవర్ బిపోర్ అనేలా ఉందని హైప్ క్రియేట్ చేశాడు. మరోవైపు లేట్ అయిన పర్లేదు కానీ.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేలా.. పుష్ప సీక్వెల్‌ను భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.

ఇక బన్నీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతకుమించి అనేలా రిస్క్ చేస్తున్నాడు. ప్రజెంట్ బన్నీకి బ్యాక్ పెయిన్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. గంగమ్మ జాతర.. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందని దేవీశ్రీ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరింత హైప్ ఇస్తోంది.