Surya Kiran: కల్యాణి ఎప్పటికీ నా భార్యే.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్యకిరణ్ చివరి మాటలు..

హీరోయిన్‌ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్య కిరణ్. ఆ తర్వాత విభేదాల కారణంగా.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తీసిన సినిమాలు వరసగా ఫ్లాప్ కావడం.. అటు పెళ్లి బంధానికి కూడా బీటలు వారడంతో.. మానసికంగా కుంగిపోయి చాలారోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 05:33 PM IST

Surya Kiran: డైరెక్టర్‌ సూర్యకిరణ్‌ మరణంతో.. టాలీవుడ్‌ షాక్‌కు గురయింది. సూర్య కిరణ్ ఇక లేరనే విషయాన్ని ఆయన అభిమానులు, సన్నిహితులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. సూర్యకిరణ్‌తో అనుబందాన్ని గుర్తుచేసుకుంటూ.. ఎమోషనల్‌ పోస్టులు పెడుతున్నారు. కొంతకాలంగా పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హార్ట్ ఎటాక్‌ రావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. ఐతే ఆయన పర్సనల్ లైఫ్‌ను గుర్తుచేసుకుంటూ.. అభిమానులు కొందరు కన్నీళ్లు పెడుతున్నారు.

gobi manchurian: గోబీ మంచూరియా ఫుడ్ కలర్‌పై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం..

హీరోయిన్‌ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్య కిరణ్. ఆ తర్వాత విభేదాల కారణంగా.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తీసిన సినిమాలు వరసగా ఫ్లాప్ కావడం.. అటు పెళ్లి బంధానికి కూడా బీటలు వారడంతో.. మానసికంగా కుంగిపోయి చాలారోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు సూర్య కిరణ్. దాదాపు ఏడేళ్లు ఎవరికీ కనిపించకుండా ఉన్న సూర్యకిరణ్.. 2020లో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 4 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఐతే అక్కడ ఆయన నెగ్గుకు రాలేకపోయారు. మొదటి వారమే బయటకు వచ్చేశారు. బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్ అయ్యాక.. తన వ్యక్తిగత జీవితం విషయాలను చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు సూర్య కిరణ్. అప్పటి ఆయన మాటలు.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. కళ్యాణి తన అమ్మ తర్వాత అమ్మ అని చెప్పుకొచ్చారు సూర్యకిరణ్‌. ఆమెను రోజూ మిస్ అవుతూనే ఉంటానని ఎమోషనల్ అయ్యారు.

తన చెల్లెళ్లపై ఎంత ప్రేమ ఉంటుందో.. కళ్యాణి అంటే కూడా అంతే ఇష్టం, ప్రేమ ఉంటాయని.. కళ్యాణి తన జీవితంలో లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కల్యాణికి తన అవసరం లేకపోవచ్చు. ఐతే తనకు మాత్రం ఆమె ఎప్పటికీ అవసరమే అని ఎమోషనల్ అయ్యారు. విడాకులు ఇద్దర్నీ వేరుచేసినా.. మనసులు మాత్రం దూరం అవ్వలేదని చెప్పుకొచ్చారు. ఈ జన్మకే కాదు.. ఇంకెన్ని జన్మలెత్తినా కూడా.. భార్య స్థానం కళ్యాణిదే అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడారు. తన ఫోన్‌లోనూ.. ల్యాప్‌ట్యాప్‌లోనూ కళ్యాణి ఫొటోనే ఉంటుందని అన్నారు. మీడియాతో సూర్యకిరణ్ మాట్లాడిన చివరి మాటలు.. ఇప్పుడు అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయ్.