Guntur Karam : మహేశ్‌బాబుకు ఆ సమస్య ఉందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆదివారం రిలీజైన ట్రైలర్‌ తోనే బాబు రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. ఈ సంక్రాంతికి మహేశ్ బాబు ఘాటు ఏ రేంజ్‌లో ఉంటుందో ట్రైలర్‌లోనే మొత్తం చూపించేశాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆదివారం రిలీజైన ట్రైలర్‌ తోనే బాబు రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. ఈ సంక్రాంతికి మహేశ్ బాబు ఘాటు ఏ రేంజ్‌లో ఉంటుందో ట్రైలర్‌లోనే మొత్తం చూపించేశాడు దర్శకుడు త్రివిక్రమ్.. అయితే.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ మధ్య కాలంలోతెలుగు సినిమాల ట్రెండ్ మారిపోతోంది. హీరోలకు చిన్న చిన్న లోపాలను పెట్టి వాటినే మేనరిజంగా మార్చి హిట్లు కొట్టేస్తున్నారు డైరెక్టర్లు.. ఇదే ట్రెండ్‌ను మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఫాలో అయిపోయాడన్న ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.

‘గుంటూరు కారం’ మూవీలో రమణ గాడి పాత్రలో మషేశ్ కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఓ ప్రమాదంలో కన్నుకు గాయం కావడంతో అది కనిపించదనే విషయాన్ని ట్రైలర్ ద్వారా చూపించారంటున్నారు నెటిజన్లు.. ట్రైలర్ ను నిశితంగా గమనిస్తే అందులో మహేష్ బాబు ఎక్కువగా ఒక కన్నుతో మాత్రమే చూస్తూ ఉంటాడు. హీరోకు ఉన్న లోపాన్ని మేనరిజంలా మార్చేసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ప్లాన్ చేశాడు త్రివిక్రమ్ అన్న టాక్‌ వినిపిస్తోంది.. రంగస్థలంలో రామ్ చరణ్, పుష్ప లో అల్లు అర్జున్, జై లవకుశ లో ఎన్టీఆర్ ఈ తరహా పాత్రలు చేసి సక్సెస్ అయ్యారు. దీంతో.. మహేష్‌కు కూడా ఈ సినిమాలో చిన్న లోపం పెట్టి త్రివిక్రమ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వార్తతో ఈ సినిమాపై హైప్‌ మరింతగా పెరిగిపోయింది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా కోసం మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. బాబు అందించే మాస్ మసాలాతో పండగను రంజుగా ఎంజాయ్ చేయాలని ఫిక్సయిపోయారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మహేష్ అభిమానులకు తెగ నచ్చేసి రికార్డులను తిరగరాస్తోంది. కుర్చీ మడతెట్టి పాటలో శ్రీలీలతో కలిసి మహేశ్‌ వేసిన మాస్ స్టెప్పులు కుర్రకారను ఊపేస్తున్నాయి.. ఇలాంటి టైమ్‌లో వచ్చిన ఈ లేటెస్ట్‌ న్యూస్ కేవలం ఊహగానం మాత్రమే.. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.. అయినప్పటికీ.. మహేశ్‌ ఫ్యాన్స్ మాత్రం ఇది నిజమని ఫిక్సయిపోయారు. ఏం ట్విస్ట్ ఇచ్చావు స్వామీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందులోఎంత నిజం ఉందో తెలియాలంటే 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే..