Geetha Madhuri: ధృవధీర్ తారక్.. కొడుక్కి ఎన్టీఆర్ పేరు పెట్టిన గీతామాధురి..

కొడుకుకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా నామకరణం చేశారు. దీంతో వాళ్ల బాబు పేరు వైరల్‌గా మారింది. ఆ పేరు నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఇప్పుడు గీతామాధురి కొడుకు పేరుని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 4, 2024 / 04:21 PM IST

Geetha Madhuri: టాలీవుడ్ టాప్ సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టర్‌ నందును ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు.. ఇప్పటికే ఓ కూతురు ఉంది. తాజాగా ఈ జంటకు ఓ బాబు పుట్టాడు. ఆ బాబుకు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ వేడుకల్లో గీతా, నందులు అచ్చమైన తెలుగు సంప్రదాయంలో కనిపించి మెస్మరైజ్ చేశారు. కొడుకుకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా నామకరణం చేశారు. దీంతో వాళ్ల బాబు పేరు వైరల్‌గా మారింది.

Pushpa-2: పుష్పరాజ్ వేట.. జపాన్‌లో పుష్ప 2 రిలీజ్

ఆ పేరు నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఇప్పుడు గీతామాధురి కొడుకు పేరుని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. తన కొడుకుకి చాలా ట్రెడిషనల్‌గా ధృవధీర్ తారక్ అని పేరు పెట్టింది ఈ జంట. గీతామాధురి బాలయ్యకు, ఎన్టీఆర్‌కి బిగ్ ఫ్యాన్. ఈ విషయం చాలాసార్లు చెప్పింది కూడా! దీంతో గీత కొడుకు పేరును వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. 2014లో గీతామాధురి.. నందును పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి వీరు చాలా అన్యోన్యంగా ఉంటూ.. తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడించేవారు. తమ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకునే వారు.

2019లో గీతా మాధురి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి ఈ జంట.. దాక్షాయణి ప్రకృతి అనే పేరును పెట్టుకుంది. గీతామాధురి ఇప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇతనికే తారక్ పేరు వచ్చేలా నామకరణం చేశారు. బాబుకు బారసాల ఫంక్షన్‌ కూడా అద్భుతంగా జరిగింది.