బెజవాడలో కార్తీ గుడ్ న్యూస్, రెండు సినిమాలపై క్లారిటీ

విజయవాడలో తమిళ స్టార్ హీరో కార్తీ సందడి చేసాడు. సత్యం సుందరం మూవీ సక్సెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించిన కార్తీ పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడాడు. సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్పాడు.

  • Written By:
  • Publish Date - September 30, 2024 / 04:21 PM IST

విజయవాడలో తమిళ స్టార్ హీరో కార్తీ సందడి చేసాడు. సత్యం సుందరం మూవీ సక్సెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించిన కార్తీ పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడాడు. సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్పాడు. విజయవాడ రావడంతోనే అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు కార్తీ. 2018 లో విజయవాడ కి వచ్చాను… మరల సత్యం సుందరం మూవీ సక్సెస్ మీట్ కి వచ్చానని తెలిపాడు. ఈ చిత్రాన్ని మా అన్న సూర్య వదిన జ్యోతిక నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాన చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు అరవిందస్వామి తో కలిసి నటించిన చాలా సంతోషంగా ఉందని తెలిపిన ఈ స్టార్ హీరో… మంచి కథ దొరికితే తెలుగు చిత్రంలో కచ్చితంగా నటిస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం విశ్వనాధ్ గారు నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చన్నాడు. బావా బావమరుదుల సాన్నిహిత్యాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామని తెలిపిన కార్తీ… ఖాకీ 2, సర్దార్ 2 ,వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకి రానున్నాయని గుడ్ న్యూస్ చెప్పాడు.

యుగానికి ఒక్కడు పార్ట్ 2 దర్శకుడు ఒప్పుకుంటే కచ్చితంగా చేస్తానన్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసామని వివరించాడు. గుంటూరు ,విజయవాడ, అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఊర్లు అన్ని ఈ చిత్రంలో చూపించామన్నాడు.