SSMB29 : మ‌హేశ్ ఫ్యాన్స్‌కు జ‌క్క‌న్న గుడ్‌న్యూస్

ఈ భారీ స‌క్సెస్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ (Superstar) మ‌హేష్‌బాబు (Mahesh Babu) తో ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇక‌.. గుంటూరు కారం (Guntur Karam) లాంటి మాస్ మ‌సాలా మూవీ త‌ర్వాత జ‌క్క‌న్న‌తో భారీ మూవీకి ఫిక్స‌య్యాడు మ‌హేశ్.. వీళ్లిద్ద‌రి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచ‌నాలున్నాయి.

 

ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి (Rajamouli).

ఈ భారీ స‌క్సెస్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ (Superstar) మ‌హేష్‌బాబు (Mahesh Babu) తో ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇక‌.. గుంటూరు కారం (Guntur Karam) లాంటి మాస్ మ‌సాలా మూవీ త‌ర్వాత జ‌క్క‌న్న‌తో భారీ మూవీకి ఫిక్స‌య్యాడు మ‌హేశ్.. వీళ్లిద్ద‌రి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచ‌నాలున్నాయి. హాలీవుడ్ (Hollywood,) రేంజ్‌లో తెర‌కెక్కించేందుకు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయ‌ని ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీకి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

అతి త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు రానున్న SSMB 29 మూవీ.. పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెర‌కెక్కునుంది. అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కావాల్సిన ఈ మూవీ గురించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జక్కన్న అండ్ టీమ్ ప్రారంభించిందట.. కాగా.. ఈ మూవీకి సంబంధించి రాజ‌మౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. మహేష్ బాబు సినిమాకి ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు అని రాజ‌మౌళి తెలిపారు. అయితే త్వరలో షూటింగ్ ఉంటుంది అంటూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. దీంతో.. మ‌హేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. రాజ‌మౌళి కామెంట్ల‌ను తెగ వైర‌ల్ చేస్తున్నారు.

కాగా..ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ.. ఇండియా లోనే భారీ బడ్జెట్ చిత్రం గా తెర‌కెక్క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకొని వచ్చారు. లేటెస్ట్ గా హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో న్యూ లుక్‌తో క‌నిపించిన మ‌హేశ్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేశాడు. ఈ ప్రెస్టీజియ‌స్ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ కీరవాణి సంగీతం అందించ‌నున్నారు.