Mokshagna: మోక్షజ్ఞను లాంఛ్ చేయనున్న గోపీచంద్‌ మలినేని!?

స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మాట కలిపారు. ఇద్దరి మధ్య ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి. దీంతో ప్రాజెక్ట్ సెట్ అయ్యిదంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 08:08 PM IST

స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మాట కలిపారు. ఇద్దరి మధ్య ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి. దీంతో ప్రాజెక్ట్ సెట్ అయ్యిదంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞ హీరో అవుతాడా ? సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఎప్పుడిస్తాడు ? ఇది గత పదేళ్లుగా వీడని చిక్కుముడి. బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు ఎంట్రీ ఇవ్వండి స్టార్ హీరోని చేసి నెత్తిన పెట్టుకుంటామంటూ బాలయ్య మీద ఒత్తిడి పెంచేస్తున్నారు. మోక్షజ్ఞ త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ బాలయ్య కూడా పలుమార్లు చెప్పారు. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ.. ఆయన మాటలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.

2022లో బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞను లాంచ్‌ చేయబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. 2023లో కూడా ఇవి పుకార్లుగానే మిగిలియా. దీనిపై ఇప్పటికీ అధికారిక అప్‌డేట్‌ లేదు. తాజాగా తారకరత్న పెద్ద కర్మలో జరిగిన ఓ సన్నివేశం.. తాజా పుకార్లకు కారణమైంది. ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన తారకరత్న పెద్ద కర్మకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు వచ్చారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని మోక్షజ్ఞతో కాసేపు మాట్లాడాడు. ఇద్దరూ ఫోన్‌ నెంబర్స్‌ కూడా ఎక్స్‌చేంజ్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ చేస్తున్న బాలయ్య అభిమానులు, మోక్షజ్ఞ ఎంట్రీకి బీజం పడిందంటున్నారు. గోపీచంద్-మోక్షజ్ఞ మధ్య ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్ఛేంజ్ అయ్యాయి కాబట్టి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నా.. బాలయ్య అభిమానులు మాత్రం మోక్షజ్ఞ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.