Guntur kaaram: గెట్ రెడీ.. గుంటూరు కారం నుంచి మరో సర్‌ప్రైజ్!

సినిమా రిలీజ్‌కు ముందు దమ్ మసాలా, ఓ మై బేబీ, మావా ఎంతైనా పర్లేదు, కుర్చీ మడతబెట్టి సాంగ్స్ రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక రమణ ఏయ్, అమ్మ సాంగ్‌ బయటికొచ్చింది. ఇందులో కొన్ని పాటల విషయంలో తమన్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. థియేటర్లో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్.

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 01:19 PM IST

Guntur kaaram: సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్‌తో 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సినిమా టాక్, కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే మహేష్‌ బాబుని చూసి పండగ చేసుకున్నారు అభిమానులు. గుంటూరు కారంలో అదరగొట్టేశాడు మహేష్ బాబు. ముఖ్యంగా బాబు బీడి స్టైల్‌కి, కుర్చీ మడతబెట్టి సాంగ్‌కు థియేటర్ బూజులు దులిపేశారు. ఈ సినిమా నుంచి మొత్తం ఆరు పాటలు రిలీజ్ అయ్యాయి. సినిమా రిలీజ్‌కు ముందు దమ్ మసాలా, ఓ మై బేబీ, మావా ఎంతైనా పర్లేదు, కుర్చీ మడతబెట్టి సాంగ్స్ రిలీజ్ చేశారు.

Avantika Mishra: అందాల అవంతిక మిశ్రా.. లేటెస్ట్ ఫొటోస్

సినిమా రిలీజ్ అయ్యాక రమణ ఏయ్, అమ్మ సాంగ్‌ బయటికొచ్చింది. ఇందులో కొన్ని పాటల విషయంలో తమన్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. థియేటర్లో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ కోసం తమన్ మరో సూపర్ సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. సోషల్ మీడియాలో గుంటూరు కారం ఆల్బమ్ షేర్ చేస్తూ.. ఒక సాలిడ్ ప్రామిస్ చేశాడు. గుంటూరు కారంలో ఇప్పటికే ఉన్న ఆరు ట్రాక్‌లతో పాటు, మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపాడు. త్వరలో ఘట్టమనేని ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్‌లా ఉంటుందని ప్రామిస్ చేశాడు. నంబర్ 7 ట్రాక్‌ని విడుదల చేస్తానంటూ తమన్ చెప్పున్నాడు. ఈ వార్త వినగానే మహేశ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న ఆరు ట్రాకులకే పూనకాలతో ఊగిపోతుంటే.. ఏడో ట్రాక్ తెస్తాను అనడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పైగా అది చాలా స్పెషల్‌గా ఉంటుందంటూ తమన్ ప్రామిస్ చేయడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయ. దీంతో సినిమాలో లేని ఈ అడిషనల్ సాంగ్ ఎలా ఉంటుందనేది ఎగ్జైటింగ్‌గా మారింది. తమన్ ఇంతలా ప్రామిస్ చేశాడంటే.. గుంటూరు కారం నుంచి మరో మాస్ బీట్ వస్తుందనే చెప్పాలి. మరి ఈ కొత్త సాంగ్ మహేష్ ఫ్యాన్స్ చేత మాస్ డ్యాన్స్ చేయిస్తుందేమో చూడాలి.