Trivikram movie : త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తి అయ్యింది. సంక్రాంతి రేసులో జనవరి 12న ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో మార్కెట్లోనే కాకుండా ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ అయితే ఉంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తి అయ్యింది. సంక్రాంతి రేసులో జనవరి 12న ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో మార్కెట్లోనే కాకుండా ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ అయితే ఉంది. తప్పకుండా సినిమా సంక్రాంతి పోటీలో మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. మరి ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్నదానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది.

అయితే .. త్రివిక్రమ్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అల్లు అర్జున్‌తో సినిమాను వెంటనే మొదలుపెట్టాలని కూడా అనుకున్నారు. సంక్రాంతికి గుంటూరు కారం సినిమా అయిపోగానే రెండు నెలల గ్యాప్ తీసుకుని బన్నీతో సినిమా మొదలుపెట్టాలని త్రివిక్రమ్ అనుకున్నాడు. అయితే ఆ సమయానికి అల్లు అర్జున్ కాస్త బిజీగా కనిపించే అవకాశం ఉంది. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ పనులు కొంత ఆలస్యంగా కొనసాగుతూ ఉండటం వలన బన్నీ డేట్స్ దొరక్కపోవచ్చు అన్న టాక్ నడుస్తోంది. ఈ లోపు టైమ్ వేస్ట్ చేయకుండా.. ఆ గ్యాప్‌లో మరొక హీరోతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గతంలో నితిన్‌తో కూడా అఆ.. అనే సినిమాను వేగంగా ఫినిష్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు త్రివిక్రమ్.. ఇప్పుడు అదే స్పీడ్‌తో నేచురల్ స్టార్ నానితో ఓ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనితో పాటు త్రివిక్రమ్ మూవీ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. విక్టరీ వెంకటేష్, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. వెంకీతో ఆయన కాంబినేషన్ సూపర్ హిట్. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలతో రచయితగా త్రివిక్రమ్ పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు అయ్యాక వెంకీతో సినిమాలు చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. ఇన్నాళ్ళకు ఆ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేలా ఉంది. అయితే గుంటూరు కారం రిలీజ్ తర్వాతనే గురూజీ నెక్స్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.