Guntur Karam: మరో నెల రోజులు గ్యాప్‌.. గుంటూరు కారం ఆగిపోయిందా ?

ఇప్పటికే ఓ సారి సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్‌ వచ్చాయి. మేకర్స్‌ వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప ఈ రూమర్స్‌ ఆగలేదు. ఇప్పుడు మరోసారి సినిమాకు లాంగ్‌ గ్యాప్‌తో ఫ్యాన్స్‌లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది. అసలు షూటింగ్‌కు ఎందుకు ఇన్నిసార్లు బ్రేక్‌ ఇస్తున్నారంటూ ఫ్యాన్స్‌ కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 10:50 AM IST

Guntur Karam: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. దాంతో పాటే కాస్త భయం కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ చాలా గాసిప్స్‌ అల్లుకుంటున్నాయి. ఇప్పటికే ఓ సారి సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్‌ వచ్చాయి. మేకర్స్‌ వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప ఈ రూమర్స్‌ ఆగలేదు. ఇప్పుడు మరోసారి సినిమాకు లాంగ్‌ గ్యాప్‌తో ఫ్యాన్స్‌లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది.

అసలు షూటింగ్‌కు ఎందుకు ఇన్నిసార్లు బ్రేక్‌ ఇస్తున్నారంటూ ఫ్యాన్స్‌ కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. అయితే మేకర్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ కంగారు పడాల్సిన పనిలేదని చెప్తున్నారు. షెడ్యూల్‌ ప్లాన్‌ ప్రకారమే షూటింగ్‌లో గ్యాప్‌ తీసుకున్నామని చెప్తున్నారు. మరో నెల రోజుల్లో షూటింగ్‌ రీస్టార్ట్‌ చేస్తామంటున్నారు. సినిమా షూటింగ్‌ దాదాపు సగం ఐపోయింది. రిలీజ్‌కు ఇంకా ఆరు నెలలు టైం ఉంది కాబట్టి ఈ ఆరు నెలల్లో షూటింగ్‌ పూర్తవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా కంప్లీట్‌ చేయొచ్చు. ఈ కారణంగానే కాస్త గ్యాప్‌ ఎక్కువైనా పట్టించుకోకుండా సినిమా యూనిట్‌ ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఫ్యాన్స్‌లో ఉన్న మరో టెన్షన్‌ మహేష్‌, త్రివిక్రమ్ కాంబో. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా, అతడు సినిమాలు థియేటర్స్‌లో పెద్దగా ఆడలేదు.

కానీ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కానీ థియేటర్‌లో నిలదొక్కుకుంటేనే ఆ సినిమా హిట్‌ కింద లెక్క. లేదంటే సినిమా ఎంత బాగున్నా ఫ్లాప్‌ కిందే చూస్తారు. ఇప్పటికే రెండు సినిమాలు థియేటర్స్‌లో బోల్తా కొట్టడంతో ఇప్పుడు వస్తున్న మూడో సినిమా మీద చాలా మందికి అనేక అనుమానాలు, భయాలు ఉన్నాయి. గురూజీ ఈసారి ఏం చేస్తాడో చూడాలి మరి.