GUNTUR KARAM: గుంటూరు కారం టీం పరిస్థితి మరీ ఘోరంగా మారిందా..?

గుంటూరు కారం మూడో సాంగ్ రిలీజ్ కావాలి. కాని కావట్లేదు. కారణం నిర్మత నిర్వాకం అని తెలుస్తోంది. మొదటి పాట రిలీజ్ చేసినప్పుడు అదేం పాట అని తమన్‌ని ట్రోలింగ్ చేశారు నెటిజన్స్.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 07:22 PM IST

GUNTUR KARAM: గుంటూరు కారం పరిస్థితి వారం వారానికి దిగజారిపోతోంది. ఒకటి త్రివిక్రమ్ తప్పైతే, రెండు తమన్. తర్వాత లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి.. ఇప్పుడు నిర్మాత. ఇలా అంతా తప్పు మీద తప్పుచేసుకుంటూ పోతున్నారు. గుంటూరు కారం ఫ్యాన్స్ కంట్లో చల్లేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో గుంటూరు కారం టీం మీద మహేశ్ ఫ్యాన్స్‌కి పెరిగిన కోపానికి స్మాల్ ఎగ్జాంపుల్.

Sandeep Reddy Vanga: అజ్ఞానులు.. రివ్యూయర్లపై సందీప్ రెడ్డి వంగా పంచ్..

విషయం ఏంటంటే గుంటూరు కారం మూడో సాంగ్ రిలీజ్ కావాలి. కాని కావట్లేదు. కారణం నిర్మత నిర్వాకం అని తెలుస్తోంది. మొదటి పాట రిలీజ్ చేసినప్పుడు అదేం పాట అని తమన్‌ని ట్రోలింగ్ చేశారు నెటిజన్స్. ఇది సూపర్ స్టార్ మీద కక్షతో యాంటీ ఫ్యాన్స్ చేసిన పనని అంతా సరిపెట్టుకున్నారు. తర్వాత రెండో పాట వచ్చింది. లిరిక్స్ బాగోలేవని పాటల రచయితకి చుక్కలు చూపించారు నెటిజన్స్. ఈ విషయంలో రామ జోగయ్య శాస్త్రి నోరు జారి, తర్వాత ఫ్యాన్స్ గోల తట్టుకోలేక ట్విట్టర్ ఎకౌంటే క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పడు మూడో పాటను రిలీజ్ చేద్దామంటే ఈలోపు ఓ డాన్స్ క్లిప్ లీకైంది.

దీంతో అసలు గుంటూరు కారం టీం ఏం చేస్తోందంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతగా సీన్ రివర్స్ అవుతున్న టైంలో మూడో పాటని లాంచ్ చేస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్డ్ అవుతారో, ట్రోలింగ్ ఎలా ఉంటుందో.. అన్న టెన్షన్ నిర్మాతలో పెరిగిందట. అందుకే మూడో పాటని లాంచ్ చేయకుండా వాయిదా వేయాలనుకున్నారట. అది కూడా మంచి నిర్ణయం కాదు. అందుకే మళ్లీ ఆలోచనల్లో పడినట్టుంది ఫిల్మ్ టీం.