Pooja Hegde: మాటల మాయగాడి వల్ల నలిగిపోతున్న పూజా హెగ్డే..? అంతే సంగతులు..?

పూజా హెగ్డే హరీష్ శంకర్ ని నమ్ముకుంది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు కాకపోవటంతో బయటికొచ్చింది. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో మాటల మాంత్రికుడిని నమ్ముకుంటే, ఆప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకి, నాలుగు అడుగులు వెనక్కి పడటంతో, ఈ సినిమా నుంచి కూడా తను బయటికి రావాల్సిన పరిస్థఇతి వచ్చిందట.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 04:27 PM IST

అసలే అనుకున్నట్టుగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ జరక్కపోవటంతో, బయటికొచ్చి తప్పుచేశాననుకుంటోంది పూజాహెగ్డే. హిట్లు లేనప్పుడు, టైం బాలేదని తెలిసినప్పుడు ఉన్న ఆఫర్స్ కంటిన్యూ చేయటమే కరెక్ట్. కాని పవన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు మొదలౌతుందో, ఎప్పుడు పూర్తవుతుందో అన్న కంగారులో ఆ ప్రాజెక్ట్ వదులుకుంది.. ఇప్పుడు ఉన్న ఒక్క గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాల్సి వస్తోంది.

ఒకవైపు 60 రోజులు కాల్ షీట్స్ ఇస్తే, త్రివిక్రమ్ ఒక్కటంటే ఒక్క రోజు కూడా పూజా,మహేశ్ ల కాంబినేషన్ సీన్ తీయలేదు. దీంతో ఆ కాల్ షీట్స్ వేస్ట్ అయ్యాయి. నిర్మాత కొత్త కాల్ షీట్స్ కి పే చేయనంటున్నాడు. కారణం తన సీన్లేవి తెరకెక్కకపోవటం. అలాని మళ్లీ ఫ్రీ గా పూజా కాల్ షీట్స్ ఇస్తే, ఇక తను సినిమా చేసినా, చేయనట్టే. సరే హిట్ వస్తే సీన్ మారుతుంది కదాని ఫ్రీగా చేయాలనుకున్నా, మహేశ్ మాత్రం పూజాకి నో చెబుతున్నాడట. కారణం త్రివిక్రమ్, పూజామీద పుకార్లు షికార్లు చేయటం. ఈ నాన్సెన్స్ తనకి వద్దని మహేశ్ భావించటం.. ఇలా రెండిటికి చెడ్డ రేవడిలా అవుతోందట పూజాహెగ్డే పరిస్తితి.