మొత్తం పోతారు, పుష్ప టీం కామెంట్స్

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 04:53 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప 2. పుష్ప మొదటి పార్ట్ వచ్చి దాదాపు నాలుగేళ్ళు అవుతున్నా రెండో పార్ట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. బాహుబలి రెండో పార్ట్ కంటే ఎక్కువ సమయం తీసుకుంది పుష్ప 2వ పార్ట్. ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి. దీని వెనుక కారణం ఏంటీ అనే దానిపై స్పష్టత లేకపోయినా సోషల్ మీడియాతో పాటుగా కొన్ని వార్తా సంస్థల్లో వస్తున్న వార్తలు హైలెట్ గా మారుతున్నాయి.

అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉన్నారు. ఆయనను టార్గెట్ చేయడానికి మెగా ఫ్యాన్స్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. అల్లు అర్జున్… మెగా ఫ్యామిలికి దూరంగా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు రామ్ చరణ్ సహా పలువురు మెగా హీరోలతో కూడా పెద్దగా మాట్లాడటానికి ఆసక్తి చూపడం లేదు అని అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా హిట్ అయితే మెగా ఫ్యామిలీ మొత్తానికి సమాధానం చెప్పాలని ఆయన భావిస్తున్నారట.

అందుకే పుష్ప 2 సినిమా ఆలస్యం అయినా అల్లు అర్జున్ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదని ఆలస్యం అయినా సరే పెద్దగా ఇబ్బంది లేదని చెప్పారట. అందుకే సుకుమార్ కూడా అల్లు అర్జున్ మాటను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉన్నారట. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప టీం ఆసక్తికర కామెంట్స్ చేసింది. పుష్ప మొదటి పార్ట్ సినిమా క్లైమాక్స్ చాలా బాగుందని… మరి రెండో పార్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అని హింట్ ఇవ్వొచ్చు అని అడిగితే… ఎక్స్ ద్వారా… పుష్ప టీం రియాక్ట్ అయింది. పోతారు, మొత్తం పోతారు అంటూ రియాక్ట్ అయింది. మరి ఏం జరగబోతుంది ఏంటీ అనేది చూడాలి.