Samantha Ruth Prabhu: ఆసుపత్రిలో చేతికి సెలైన్‌తో సమంత.. ఏమైంది..?

సమంత సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాలో నిత్యం అప్‌డేట్లు ఇస్తూనే ఉంటుంది. సమంత తన పరిస్థితి గురించి చెప్తూ ఇప్పుడు ఓ పోస్ట్ వేసింది. అదే సంచలనంగా మారింది.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 07:20 PM IST

Samantha Ruth Prabhu: ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్‌ చేస్తోంది. తన హెల్త్ కోసం, తన కోసం టైం కేటాయించుకుంటోంది. ఇన్ని రోజులు సినిమాలంటూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడిపిన సమంత.. ఇప్పుడు వెకేషన్లంటూ నేచర్‌ను ఆస్వాధిస్తోంది. మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సామ్‌.. సినిమా కెరీర్‌ను పూర్తిగా పక్కనపెట్టేసింది. తాను పూర్తిగా కోలుకోవాలని చికిత్స తీసుకుంటోంది. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ, మధ్య మధ్యలో వెకేషన్లంటూ తిరిగేస్తోంది.

సమంత సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాలో నిత్యం అప్‌డేట్లు ఇస్తూనే ఉంటుంది. సమంత తన పరిస్థితి గురించి చెప్తూ ఇప్పుడు ఓ పోస్ట్ వేసింది. అదే సంచలనంగా మారింది. ఈ పోస్టులో సమంత హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నట్టుగా.. చేతికి సెలైన్ పెట్టించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ‘ఇమ్యూనిటీ బూస్ట్ వల్ల కలిగే లాభాలివే.. రక్త కణాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి పెరుగుదల, హృదయ సంరక్షణ, కండరాల శక్తి, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి, హృదయానికి రక్త సరఫరా, ఎముకల బలహీనత పోగొట్టేందుకు ఉపయోగపడుతుంది’ అంటూ సమంత చెప్పుకొచ్చింది. అంటే తనకేమీ కాలేదని. తాను రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇలా సెలైన్ ఎక్కించుకుంటున్నాను అని చెప్పకనే చెప్పింది సమంత.

చివరగా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది సామ్‌. ఐతే ఖుషి సినిమాను కంప్లీట్ చేయడానికి కూడా చాలా కష్టపడింది. సమంతకు మయోసైటిస్ రావడం వల్ల ఆరేడు నెలలు విశ్రాంతి తీసుకుంది. ఆ టైంలో ఖుషి సినిమా షూటింగ్ జరగలేదు. ఇక ఖుషి సినిమా రాదని అంతా అనుకుంటున్న టైంలోనే సమంత సెట్స్‌లోకి తిరిగి వచ్చింది. చకచకా షూటింగ్ పూర్తి చేసింది. సినిమాను తన స్టైల్లో వీలైనంతగా ప్రమోట్ చేసింది కూడా.