జానీ మాస్టర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్

టాలీవుడ్ ని జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం కుదిపేస్తోంది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది అర్ధం కాని పరిస్థితి. జానీ మాస్టర్ నీచుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు వైరల్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 17, 2024 / 06:47 PM IST

టాలీవుడ్ ని జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం కుదిపేస్తోంది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది అర్ధం కాని పరిస్థితి. జానీ మాస్టర్ నీచుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు వైరల్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఎక్స్ లో పలువురు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. త్వరలోనే జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఎవరితో మాట్లాడకుండా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళాడని అంటున్నారు.

జానీ మాస్టర్ ను కఠినం గా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆయనతో సినిమాలు చేసే దర్శకులు ఆయన్ను పక్కన పెట్టాలని పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఓ సినిమా ఫంక్షన్ లో మెగా హీరో సాయి ధరం తేజ్… మాట్లాడుతూ జానీ మాస్టర్ ను హగ్ చేసుకుంటాడు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ చేస్తూ జానీ మాస్టర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. సాయి ధరం తేజ్ ఇటీవల ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే కామెంట్ ని వైరల్ చేస్తూ సాయి ధరం తేజ్ ని ట్రోల్ చేస్తున్నారు. మెగా హీరోలు అందరితో జానీ మాస్టర్ చాలా సన్నిహితంగా ఉంటాడు. దాదాపు మెగా హీరోల సినిమాలు అన్నిటికి జానీ మాస్టర్ పని చేస్తారు. దీనితో ఇప్పుడు మెగా ఫ్యామిలీని కూడా ట్రోల్ చేస్తున్నారు జనాలు. కాగా ఈ వ్యవహారంలో జనసేన పార్టీ అలెర్ట్ అయింది. జానీ మాస్టర్ ను పార్టీకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అటు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఆయన్ను బయటకు పంపే అవకాశాలు కనపడుతున్నాయి.