Kareena Kapoor Khan: డైరెక్ట్ మూవీ కన్నా ఓటీటీ బెస్ట్ అంటున్నకరీనా..!

కరీనా కపూర్ బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్. దశాబ్దానికి పైగా ఎన్నో సినిమాల్లో నటించింది. అద్భుతమైన విజయాలు అందుకుంది. తర్వాత బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం నెమ్మదిగా తగ్గించింది.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 04:22 PM IST

Kareena Kapoor Khan: ఇండియాలో ట్రెండ్ మారింది. ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఒకప్పుడు వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఇప్పుడు డిజిటిల్ బాట పట్టేందుకు సై అంటున్నారు. కత్తిలాంటి కథ దొరికితే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇదే క్లబ్‌లో చేరిపోయింది కరీనా కపూర్.

కరీనా కపూర్ బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్. దశాబ్దానికి పైగా ఎన్నో సినిమాల్లో నటించింది. అద్భుతమైన విజయాలు అందుకుంది. తర్వాత బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం నెమ్మదిగా తగ్గించింది. సంసార జీవితంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టెందుకు ఈ బ్యూటీ రెడీ అయింది. ‘జానే జాన్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది కరీనా కపూర్. ఆమె లీడ్ రోల్‌లో జానే జాన్ అనే వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు దర్శకుడు సుజయ్ ఘోష్. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 21న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేశాడు డైరెక్టర్. మాయ అనే ఒక స్త్రీ కొన్ని కారణాల వల్ల తన భర్తను హత్య చేస్తుంది.

ఆ రహస్యాన్ని దాచిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆమె ప్రయత్నాలు ఫలించాయా..? లేదా..? అనేది ఈ సినిమా అసలు స్టోరీ. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. మరి ఫస్ట్ టైం కరీనా చేసిన ఈ వెబ్ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.