YASH: ప్రభాస్‌ని చూసి నేర్చుకుంటున్న కన్నడ స్టార్..

బాహుబలి 1, బాహుబలి 2 రెండూ కూడా ప్రభాస్‌ని అమాంతం పాన్ ఇండియా సూపర్ హీరోగా మార్చాయి. ఆ ఇమేజ్‌ని మ్యాచ్ చేసే కథ దొరుకుతుందా అనేంతగా తన ఇమేజ్ పెరిగింది. అయితే, అదే కొంపముంచింది. తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా ఏం చేసిన పంచ్ పడింది.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 06:04 PM IST

YASH: కన్నడ స్టార్ యష్ ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్నాడు. ఏ సినిమా చేయలేదు. ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వలేదు. శంకర్ నుంచి పూరీ వరకు చాలా మంది ఈ హీరోతో మూవీ తీయబోతున్నారనే పుకార్లే తప్ప వాస్తవంగా ఏదీ కార్యరూపం దాల్చలేదు. కానీ, ఇప్పుడు తీరిగ్గా మలయాళ దర్శకురాలి సినిమాకు సై అన్నాడు. కారణం ఇద్దరు.. ఒకరు యంగ్ టైగర్, రెండు రెబల్ స్టార్. ప్రభాస్ విషయానికొస్తే, బాహుబలి 1, బాహుబలి 2 రెండూ కూడా ప్రభాస్‌ని అమాంతం పాన్ ఇండియా సూపర్ హీరోగా మార్చాయి.

ఆ ఇమేజ్‌ని మ్యాచ్ చేసే కథ దొరుకుతుందా అనేంతగా తన ఇమేజ్ పెరిగింది. అయితే, అదే కొంపముంచింది. తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా ఏం చేసిన పంచ్ పడింది. ప్రభాస్ కటౌట్‌కి తగ్గ కథ, దాన్ని తీసే దర్శకుడు పడకే ఇలా అయ్యింది. ఇలా జరక్కుండా ఉండాలంటే వెంట వెంటనే మూవీలు చేయకూడదని యష్ నిర్ణయించుకున్నాడట. బాహుబలి 1, 2 తర్వాత వెంటనే ప్రభాస్ ప్రయోగాలు చేసి తప్పు చేశాడు. ఆ తప్పు తను చేయకూడదనే యష్.. చాలా సమయం తీసుకున్నాడు. అంతెందుకు.. త్రిబుల్ఆర్‌తో పెరిగిన రామ్ చరణ్ ఇమేజ్‌ని, తర్వాత వచ్చిన ఆచార్య డ్యామేజ్ చేసింది. ఈ మూవీతో రామ్ చరణ్‌కి కూడా పంచ్ పడింది. సో ప్రభాస్‌ని చూసి యశ్ జాగ్రత్త పడ్డట్టే.. చరణ్‌ని చూసి తారక్ జాగ్రత్త పడుతున్నాడు.

తను కూడా కొరటాల శివ మూవీని వెంటనే ఓకే చేయకుండా, కథని మార్చి, చాలా టైం ఇచ్చి.. ఇలా జాగ్రత్తగా పాన్ ఇండియా ఇమేజ్‌ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు తారక్. అచ్చంగా ఆ దారినే కేజీయఫ్ స్టార్ యశ్ ఫాలో అవుతున్నట్టున్నాడు. మొత్తానికి మలయాళ దర్శకురాలితో గ్యాంగ్‌స్టర్ జోనర్‌లో సినిమాను ఫైనల్ చేశాడు. చాలా టైం తీసుకుని మరీ పాన్ ఇండియా దండయాత్ర షురూ చేయనున్నాడు.