Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరంపై కుట్ర..?

ఫెయిల్యూర్‌ హీరోగా ముద్ర వేసి.. ఇండస్ట్రీ నుంచి తనను పంపించేందుకే కొందరు వ్యక్తులు ఇలా కుట్ర చేయిస్తున్నారంటూ చెప్పాడు.

  • Written By:
  • Publish Date - February 23, 2023 / 02:59 PM IST

ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న తక్కువ మంది హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్‌.. ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతి తక్కువ టైంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

అయితే కిరణ్‌ను ఇండస్ట్రీకీ దూరం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారట. డబ్బులిచ్చి మరీ తనపై నెగటివ్‌ ప్రచారం చేయిస్తున్నారట. తన సినిమాల గురించి బ్యాడ్‌ కామెంట్లు పెట్టిస్తున్నారట. వినరో భాగ్యము వీరకథ మూవీ సక్సెస్‌ మీట్‌లో కిరణ్‌ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. ట్విటర్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. వందల సంఖ్యల్లో నెగటివ్‌ కామెంట్లు వస్తున్నాయని చెప్పాడు. అయితే ఈ కామెంట్లు పెట్టే వ్యక్తులెవరూ తెలుగు వారు కాదని చెప్పాడు.

పుణె, బిహార్‌ ప్రాంతాల నుంచి చాలా మంది వ్యక్తులు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని చెప్పాడు. తానెవరో తెలియకుండానే ఇలా కామెంట్లు పెడుతున్నారంటూ చెప్పుకొచ్చాడు. ఫెయిల్యూర్‌ హీరోగా ముద్ర వేసి.. ఇండస్ట్రీ నుంచి తనను పంపించేందుకే కొందరు వ్యక్తులు ఇలా కుట్ర చేయిస్తున్నారంటూ చెప్పాడు. కిరణ్ అబ్బవరం చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. కిరణపై ఇంత భారీ స్థాయిలో కుట్ర చేస్తున్న వ్యక్తులు ఎవరా అని అంతా చర్చించుకుంటున్నారు.